భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ మెల్బోర్న్ లో ప్రారంభమైన మూడో టెస్టులో భారత్ తన మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను భారత బౌలర్లు క్రమంగా దెబ్బతీస్తు వచ్చారు. మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి అస్ట్రేలియా 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. బ్యాటింగ్కు దిగిన ఆసీస్ జట్టు ఆదిలో తడబడినా ఆ తర్వాత నిలదొక్కుకుంది. తొలుత ఓపెనర్గా దిగిన వార్నర్ ఖాతా తెరవకుండానే యాదవ్ బౌలింగ్లో ధావన్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దాంతో ఆసీస్ ఆదిలోనే తొలి వికెట్ను కోల్పోయింది. అనంతరం ఆసీస్ నిలదొక్కుకుని దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.
ఆసీస్ ఓపెనర్ రోజర్స్ ఆది నుంచి నిలకడగా ఆడగా అతనికి వాట్సన్ సరిజోడిగా విజృంభించాడు. ఇద్దరూ అర్థ సెంచరీ చేయటంతో పాటు వెనువెంటనే అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన మార్ష్, బర్న్స్ తక్కువ స్కోర్కే పెవిలియన్ దారి పట్టాడు. ఇక కెప్టెన్ స్మిత్ నిలకడగా ఆడుతూ అర్థ సెంచరీ చేశాడు. కెప్టెన్ స్మిత్ 72, హాడిన్ 23 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఇక ఆసీస్ ఆటగాళ్లు రోజర్ 57, వాట్సన్ 52, మార్ష్ 32, బర్న్స్ 13 పరుగులు చేశారు. ఉమేష్ యాదవ్, షమికీ చెరో రెండు వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ దక్కింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more