గత సీజన్ లో ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన కోల్ కత్తా ఈ సీజన్ లో లీగ్ దశలోనే తడబాటుకు గురైంది. ఆడిన తొమ్మిది మ్యాచ్ ల్లో కేవలం మూడంటే మూడే గెలిచింది. నిన్న రాత్రి తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో విజయం సాధించి వరుస పరాజయాల నుండి బయటపడింది. అంతకు ముందు అదే పంజాబ్ జట్టు పై పరాజయం పాలైన నైట్ రైడర్స్ దానికి ప్రతీకారంగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ని 6 వికెట్ల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాట్స్ మెన్స్ మనన్ వోహ్రా (21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్తో 31), గుర్కీరత్ (15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 నాటౌట్ ), గిల్క్రిస్ట్ (27 బంతుల్లో 4 ఫోర్లతో 27), మన్దీప్ (20 బంతుల్లో 5 ఫోర్లతో 25), డేవిడ్ హస్సీ (20 బంతుల్లో ఫోర్తో 21) రాణించారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ సమిష్టిగా రాణించినా, కొల్ కత్తా బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో భారీ స్కోరు చేసే అవకాశం ఉన్నా సాధించలేకపోయింది.
ఇక 150 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కి కోల్ కత్తా కు ఆదిలో కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డా మిగతా బ్యాట్స్ మెన్స్ సమిష్టిగా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. కలిస్ (33 బంతుల్లో 6 ఫోర్లతో 37; 2/14) ఆల్రౌండ్ షోతో రాణించగా, మన్వీందర్ బిస్లా (44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 నాటౌట్), ఇయాన్ మోర్గాన్ (26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 42) చెలరేగారు. దీంతో మరో పది బంతులు మిగిలి ఉండగానే కోల్ కత్తా విజయాన్ని అందుకుంది. కలీస్ బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోను రాణించాడు. దీంతో కోల్ కత్తా ఆశలు కాస్త సజీవం అయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more