హైదరాబాద్ అన్ని ప్రాంతాల వారిదని, దాని పైన ప్రయోగాలు చేసి ఎవరికీ కాకుండా చేసేందుకు ప్రయత్నించడం సరికాదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం రాణిగారి తోటలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో లగడపాటి పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికే తమ ప్రయత్నమని, మరి ఏ ఇతర ప్యాకేజీలకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.
దత్తపుత్రుడు, వేర్పాటువాదుల అండతోనే కాంగ్రెసు పార్టీ అధిష్టానం విభజనకు నిర్ణయం తీసుకుందని లగడపాటి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తాము మొదటి నుండి పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని లగడపాటి పేర్కొన్నారు.
పోలీసులకు చిక్కిన వంశీకృష్ణ
వినేవారుంటే ఎన్ని కట్టు కథలైనా చెప్పొచ్చు అన్న నానుడిని ఉంది. అచ్చం అలాగే ఓ కేటుగాడు అమాయక ప్రజలే అతని పెట్టుబడిగా చేసుకొని..నమ్మించి నయ వంచన చేశాడు. ఎంతటి వారినైనా సరే అతను ఇట్టే బుట్టలో వేసుకుంటాడు. ఒకే భూమిని వివిధ రకాల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించి బురడీ కొట్టించాడు. చచ్చిపోయాడని పోలీసులనే నమ్మించాడు. అమాయక ప్రజల నుంచి కోట్లాది రూపాయలు కాజేశాడు. అతడే 'నార్ల వంశీకృష్ణ'....
సినీ ఫక్కిలో మాయ
2011 జనవరి 5న గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల దగ్గర కాలువలో ఒక కారు పడింది. కారులో ప్రయాణిస్తున్న వంశీకృష్ణ తాను గల్లంతైనట్లుగా...సినిమా స్టోరీని తలదన్నేలా పక్కా స్కేచ్ వేసి, ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. సీన్ కట్ చేస్తే ఆ కారులో వంశీకృష్ణ లేడని పోలీసులు నిర్ధారించారు. అదృశ్యం అంతా ఒక కట్టు కధగా భావించిన పోలీసులు వంశీ కోసం ప్రత్యేక నిఘా పెట్టి గాలిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన వంశీకృష్ణను సూర్యారావు పేట పోలీసులు విచారిస్తున్నారు.
వంశీకృష్ణపై 16 కేసుల నమోదు
కారు ప్రమాదంలో వంశీ చనిపోయాడని అతడి చేతిలో మోసపోయిన బాధితులు అనుకున్నారు. తరువాత వంశీ మోసాల చిట్టా ఒక్కొకక్కటిగా బయటపడ్డాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 16 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే వంశీ ఉన్నాడా? అని తెలుసుకునేందుకు బాధితులు సూర్యారావు పేట పోలీస్ స్టేషన్కు వచ్చి వెళ్తున్నారు. ఒకే ప్లాటును వివిధ రకాల పేర్లతో నకిలీ వ్యక్తులను తయారు చేసి... దొంగ రిజిస్ట్రేషన్లు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల తీరు అనుమానం..!
వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ దగ్గర ఎవరూ లేరని, తాము ఎవర్నీ అరెస్టు చేయలేదంటూ చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాని కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన మాయగాడి నుంచి వివరాలు రాబట్టేందుకు పోలీసు ఉన్నాతాధికారులు తమదైన శైలిలో విచారిస్తున్నట్లు సమాచారం.
వంశీకృష్ణను విచారిస్తున్న పోలీసులు
స్థిరాస్థి వ్యాపారం పేరిట రూ.50 కోట్ల మేర మోసం చేసిన మాయగాడు వంశీకృష్ణను పోలీసులు విచారిస్తున్నారు. వంశీకృష్ణ తల్లి సుజాత సజీవంగానే ఉందని దర్యాప్తులో వంశీకృష్ణ వెల్లడించినట్లు తెలుస్తోంది. బినామీ పేర్ల మీదకు ఆస్తులను బదిలీ చేసినట్లు వంశీకృష్ణ పోలీసులకు తెలిపారు. తెనాలి నుంచి వస్తూ దుగ్గిరాల దగ్గర కారు కాలువలోకి దూసుకెళ్లిన ఘటన కట్టు కథే అని, కారును కాలువలోకి వంశీకృష్ణే తోసివేసినట్లు వెల్లడించారు. ఆస్తుల స్వాధీనానికి పోలీసులు కసరత్తు ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more