గృహాలంకరణలో భాగంగా రంగులు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఇంటిలోపల, బయట అనుకూలమైన రంగులు వేయిస్తే... ఆ ఇల్లు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, ఉత్సాహకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతకాలంలో ఎన్నో కొత్తరకాల రంగులు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అయితే ఈ రంగులను గృహానికి కొట్టించేముందు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఫెంగ్ షుయ్ నిపుణులు తమ శాస్త్రాలప్రకారం తెలుపుతున్నారు.
గృహానికి పెయింట్ కొట్టించే సమయంలో ఏ ప్రదేశంలోనైనా నలుపురంగును అస్సలు వాడకూడదని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇంటి పైకప్పుమీద గానీ, దూలాలకు గానీ నలుపురంగును ఎటువంటి పరిస్థితులోనైనా ఉపయోగించకూడదని ఫెంగ్ షుయ్ శాస్త్రంలో పేర్కొనబడింది. అలాకాకుండా ఎక్కడైనా నలుపురంగా వేయిస్తే.. అటువంటి గృహంలో నివాసం వున్నవారికి ఎల్లప్పుడూ ప్రశాంతత లోపిస్తుంది. కుటుంబసభ్యుల మధ్య తగాదాలు, శుభకార్యాలు మధ్యలోనే నిలిచిపోవడం, ఎంత సంపాదించినా డబ్బులు మిగలకపోవడం వంటి సమస్యలు ఎక్కువవుతాయని వారు చెబుతున్నారు. కాబట్టి నలుపురంగులను అస్సలు వాడకూడదు.
అదేవిధంగా ఇంటి పైకప్పులకు, దూలాలకు తెలుపురంగును కొట్టిస్తే.. అటువంటి ఇంట్లో వున్నవారి వ్యాపారాలు ఎంతో పురోభివృద్ధి చెందుతాయని, దాంపత్య జీవితం సుఖంగా గడిచిపోతుందని చెబుతున్నారు. గృహంలో పడమర దిక్కున తెలుపురంగుగానీ లేదా తెలుపురంగుతో కూడిన పోస్టర్లు గానీ తగిలిస్తే.. కుటుంబ సభ్యుల మధ్య సుఖసంతోషాలు విల్లివిరుస్తాయి. ఇతరులతో సంబంధబాంధవ్యాలు పెరుగుతాయి. కొన్ని సమస్యలు ఎదురయినా.. వాటికవే సమసిపోతాయి. మొత్తానికి తెలుపురంగుతో గృహానికి పెయింట్ చేయిస్తే.. కొంతలో కొంతయినా మేలు జరుగుతుంది.
ఇక మిగిలిన ఎరుపు, ఆకుపచ్చ, నీలం వంటివి రంగులను గృహంలో దక్షిణ, ఆగ్నేయ, ఈశాన్య దిశలలో పెయింట్ చేయించడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని, సుఖసంతోషాలు చేకూరుతాయని నిపుణులు సలహాలు ఇస్తున్నారు. ఈ మూడురంగులు, మూడు దిశలకు చిహ్నంగా పనిచేస్తాయి.
అందులో మొదటిది ఎరుపురంగు దక్షిణానికి చిహ్నం. ఇది రాబడికి ప్రతిరూపం. అందువల్ల దక్షిణంవైపు ఎరుపురంగుతో కూడిన పోస్టర్లుగానీ, కర్టెన్ లుగానీ వుంచితే.. వారి వ్యాపారాలు అభివృద్ధిబాటవైపు కొనసాగడమే కాకుండా.. మంచి లాభాలు అందుతాయి. ఆర్థికపరమైన సమస్యలు వున్నవారికి తక్కువసమయంలోనే త్వరగా సమసిపోతాయి.
రెండవది అయిన ఆకుపచ్చరంగు ఆగ్నేయానికి చిహ్నం. ఇది సంపదకు ప్రతిరూపం. ఈ ఆకుపచ్చరంగును ఆగ్నేయంతోపాటు తూర్పువైపున కూడా వేయిస్తే మంచి శుభఫలితాలు అందుతాయి. ఆకుపచ్చ రంగులో వున్న మొక్కల పూలకుండీలను ఆగ్నేయ లేదా తూర్పు దిశల్లో వుంచితే.. వారి సంపద చాలా బాగా పెరుగుతుంది.
ఇక చివరిదైన నీలం రంగు ఈశాన్యానికి చిహ్నం. ఈ రంగును ఉత్తరంవైపు కూడా వేయించుకోవచ్చు. దీనివల్ల జీవితంలో వున్న కష్టాలను అధిగమించవ్చునని, సులభంగా అన్ని పనులను ముగించుకోవచ్చునని శాస్త్రనిపుణులు పేర్కొంటున్నారు. ఇలా ఈ విధంగా రకరకాల రంగులను వాస్తుశాస్త్రాల ఆధారంగా ఇంటికి వేయిస్తే... సమస్యల నుంచి గట్టెక్కి, మంచి ఫలితాలను పొందవచ్చు.
(And get your daily news straight to your inbox)
May 13 | సాధారణంగా కొత్త ఇంటి నిర్మాణాలను చేపట్టేముందు ప్రతిఒక్కరు తమకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలను ముగించుకుంటారు. ఆధ్యాత్మిక సలహాలను కూడా పండితులు లేదా జ్యోతిష్య నిపుణుల నుంచి తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో వాటి అమరికను... Read more
May 01 | ప్రతిరోజు అందరు ఉదయాన్నే లేవగానే రోజువారీ కార్యక్రమాలు ముగించుకున్న తరువాత స్నానాలు చేసుకుంటారు. ప్రతిరోజు స్నానాలు చేయడంతో ఆరోగ్యంగా వుండటమే కాకుండా.. మన అందాన్ని మరింత పెంపొందించుకోవచ్చు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం స్నానం చేసేటప్పుడు... Read more
Apr 28 | సాధారణంగా ప్రతిఒక్కరికి కలలు రావడం సహజమే. కానీ అందులో కొన్ని కలలు శుభం కలిగిస్తాయని, మరికొన్ని కలలు అశుభ కలిగిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరికి వస్తుంటాయి.... Read more
Apr 25 | ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరు ప్రతి చిన్న విషయంలో కూడా మానిసక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఆర్థికపరంగా సమ్యలు, ఉద్యోగాలు దొరకకపోవడం, విద్యార్థులు సరిగ్గా చదవకపోవడం, నిర్వహించిన పనులు సరిగ్గా జరగకపోవడం, శుభకార్యాలు అస్మాత్తుగా నిలిచిపోవడం, ఆస్తులకు సంబంధించిన... Read more
Apr 24 | ప్రతిరోజూ నిర్వహించుకుంటున్న కార్యకలాపాలు, అధిక శ్రమ వల్ల ప్రతిఒక్కరు ఒత్తిడికి గురవుతుంటారు. దాంతో అటువంటివారికి రాత్రివేళ అంత తేలికగా నిద్రపట్టదు. విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని, ఉద్యోగస్తులు ఉన్నతిని పొందాలని, వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని... Read more