ఆసియా కప్-2022లో భాగంగా హాంకాంగ్తో ముగిసిన మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ లో తనదైన శైలిలో విరుచుకుపడిన సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ బ్యాటింగ్కు రాకముందు.. వచ్చిన తర్వాత అన్నట్టుగా సాగింది. టీ20లలో చెలరేగి ఆడుతున్న ఈ నయా మిస్టర్ 360.. జులైలో ఇంగ్లండ్, ఆగస్టులో వెస్టిండీస్ పర్యటనల్లోనూ ఇదే దూకుడును కొనసాగించాడు. దీంతో టీమిండియా అభిమానులంతా అతడిని టీ20లలో భారత జట్టు నెంబర్ వన్ ఆటగాడిగా కీర్తిస్తున్నారు. మరి ఇందులో వాస్తవమెంత..? గణాంకాలు ఏం చెబుతున్నాయి..?
ఐపీఎల్ మెరుపులతో సూర్యకుమార్ యాదవ్ 2021లో భారత టీ20 జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతడి అరంగేట్రం నుంచి చూసుకుంటే టీమిండియాలో అత్యధిక పరుగులతో పాటు సగటు, స్ట్రైక్ రేట్ లోనూ సూర్యనే మిగిలిన అగ్రశ్రేణి బ్యాటర్లకంటే ముందున్నాడు. 2021 నుంచి ఇప్పటివరకు సూర్య మొత్తంగా 25 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 23 ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేసి 758 పరుగులు చేశాడు. సగటు 39.89గా ఉంది. ఇందులో ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలున్నాయి. ఈ జాబితాలో రోహిత్ శర్మ.. 26 ఇన్నింగ్స్ (సూర్య ఎంట్రీ నుంచి మాత్రమే)లలో 747 పరుగులు చేశాడు.
రోహిత్ కూడా 6 హాఫ్ సెంచరీలు చేశాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (19 ఇన్నింగ్స్ లలో 543 పరుగులు, 4 హాఫ్ సెంచరీలు), శ్రేయాస్ అయ్యర్ (19 ఇన్నింగ్స్ లలో 533) ఉన్నారు. విరాట్ కోహ్లీ 13 ఇన్నింగ్స్లలో 474 రన్స్ చేశాడు. ఈ అందరిలో ఒక్క విరాట్ కోహ్లీ సగటు (59.25) మాత్రమే సూర్య కంటే ఎక్కువగా ఉంది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు టీ20లలో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్ల జాబితా చూస్తే అందులోనూ సూర్యనే ముందున్నాడు. ఈ ఏడాది 14 ఇన్నింగ్స్ లో సూర్య.. 514 పరుగులు చేశాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ (14 ఇన్నింగ్స్, 449 పరుగులు), రోహిత్ శర్మ (15 ఇన్నింగ్స్, 323) ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more