ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు ముందుగానే దేశ అర్థిక తిరోగమనంలోకి జారుకుందన్న వార్తలు వినిపించాయి. అయితే కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో ప్రజల ప్రాణాలకే అధిక ప్రాధాన్యతను ఇచ్చిన కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసింది. ఆ తరువాత మే నెల నుంచి అన్ లాక్ లను ప్రకటిస్తూ వస్తోంది. అయితే వరుసగా రెండో త్రైమాసికంలోనూ జీడీపీ వృద్దిరేటు క్షీణించిందని.. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుందని అర్భీఐ నిపుణులు పేర్కోంటున్నారు.
కోవిడ్-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన కారణంగా ఈ ఏడాది ఏప్రీల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ 23.9శాతం క్షీణించింది. ఇక రెండో త్రైమాసికమైన జులై-సెప్టెంబర్ లోనూ వృద్దిరేటు 8.6శాతం కుదించుకుుపోయింది, నౌకాస్ట్ విధానంలో తొలిసారి విడుదల చేసిన అంచనాల్లో అర్థిక రంగ నిపుణులు ఈ మేరకు అభిప్రాయపడ్డారు, భారత అర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించిందని మానిటరీ పాలసీశాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. దేశ చరిత్రలో తొలిసారిగా భారత్ సాంకేతికంగా ఆర్థికమాంద్యంలోకి ప్రవేశించిందని ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్ పేరుతో రాసిన ఆర్టికల్ లో మానిటరీ పాలసీ డిపార్డుమెంటు పంకజ్ కుమార్ అనుమానాలు వ్యక్తం చేశారు.
నౌకాస్టింగ్ విధానంలో వేర్వేరు సమాచారాల్ని విశ్లేషించి భారత్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుందనే అంచనాలకు వచ్చారు. ఆర్బీఐ నెలవారీ బులిటెన్ లో ప్రచురించిన అంచనాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్న అభ్యంతరాలు వున్నాయి. రెండో త్రైమాసిక గణాంకాలు, అంచనాలను ఆర్బీఐ నవంబరు చివర్లో విడుదల చేసిన తరువాత.. అధికారిక జీడీపీ గణాంకాలు వెలువడే అవకాశాలు వున్నాయి. అయితే దశలవారీగా కార్యకలాపాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తే క్షీణతను అడ్డుకోవచ్చనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ అర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 9.5శాతం క్షీణించే అవకాశాలున్నాయని ఆర్బీఐ గతంలో అంచనా వేసింది.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more
Jun 04 | సినీ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సీరియల్ లో నటించే హీరోయిన్స్ సైతం ఎదో ఒకరకంగా న్యూస్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పైగా హీరోయిన్స్ కి మేము ఏమాత్రం తీసిపోము అంటూ... Read more