పాకిస్థాన్ వైపు నుంచి అంతర్జాతీయ సరిహద్దు మీదుగా డ్రోన్లు రావడం ఇటీవల నిత్యకృత్యంగా మారింది. ఇలాంటి డ్రోన్లు కాశ్మీర్లోని సైనిక స్థావరాలను కేంద్రంగా చేసుకుని దాడులకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. తొలుత కెమెరాలతో భారత సైనిక రహస్యాలను చిత్రీకరించిన ద్రోణులు.. తరువాతి క్రమంలో దాడులకు తెగబడ్డాయి. ఇక తాజాగా భారత యువతను లక్ష్యంగా చేసుకుని అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. ఇప్పటివరకు ఎన్నో డ్రోన్లను సరిహద్దు దళాలు కూల్చిశాయి. కాగా, బుధవారం అర్ధరాత్రి అమృత్సర్ వైపునకు వస్తున్న డ్రోన్పై బీఎస్ఎఫ్ కాల్పులు జరిపి కూల్చివేసింది.
తాజాగా వస్తున్న డ్రోన్ల ద్వారా మన దేశంలోకి మత్తు మందుతోపాటు మందుగుండు సామగ్రి సరఫరా చేస్తున్నట్లు సరిహద్దు దళాలు గుర్తించాయి. సరిహద్దును దాటుకుని పాకిస్థాన్ డ్రోన్లు మన దేశంలోకి మత్తు మందుతోపాటు మందుగుండును సరఫరా చేస్తున్నాయి. సరిహద్దు దళాల కండ్లు గప్పి మరీ ఇలా విధ్వంసానికి సాయపడుతున్న పలు డ్రోన్లను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేస్తున్నారు. తాజాగా బుధవారం అర్ధరాత్రి పాకిస్థాన్ వైపు నుంచి సరిహద్దు మీదుగా అమృత్సర్ వైపున బీఏపీ చన్నాకు 400 మీటర్ల దూరంలో డ్రోన్ కనిపించింది. దీనిని గుర్తించిన బీఎస్ఎఫ్ 38 రౌండ్ల కాల్పులు జరపడంతో పాటు తేలికపాటి బాంబులు వేసింది.
తొలి డ్రోన్ కనిపించిన 5 నిమిషాలకు మరో డ్రోన్ వచ్చింది. దీనిపై కూడా బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తమై 13 రౌండ్ల కాల్పులు జరిపాయి. అయితే, ఈ డ్రోన్ తప్పించుకుని పాకిస్థాన్ వైపు వెళ్లిపోయింది. అనంతరం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా.. రత్న ఖుర్ద్ ప్రాంతంలో రెండు ఆకుపచ్చ కూల్డ్రింక్ బాటిళ్లలో నింపిన హెరాయిన్ను గుర్తించింది. రెండు బాటిళ్లలో ఉన్న 940 గ్రాముల హెరాయిన్ ఉన్నదని, దీని ధర అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మరో చోట తుపాకీ బుల్లెట్లను బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more