ఆయన ఓ దినసరి కూలి. చదివుకున్నది కూడా పెద్దగా లేదు. అయితే పెద్దలు చెప్పినట్టు అవసరాన్ని మించిన అలోచన లేదు. ఆలోచనతో పుట్టని ఆవిష్కరణ లేదు. ఇదే ఇప్పుడీ సాధారణ కూలీని దేశవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టింది. రెక్కాడితే కానీ డిక్కాడని పేద కూలీ అయిన బిపిన్ కదమ్.. చిన్నప్పటి నుంచి పేదరికంలోనే పుట్టిపెరిగాడు. దినసరి కూలీగా జీవనం సాగిస్తూ ఉన్నాడు. అయితే తాటికాయపై రోకటిపోటు అన్నట్లు ఆయన పేదరికానికి తోడు ఆయనకు దివ్యాంగురాలైన కూతురు పుట్టింది. అయినా సాధారణ పిల్లల మాదిరిగా అమెను పెంచేందుకు బిపిన్ కష్టపడుతూనే ఉన్నాడు.
అయితే ఎవరో ఒకరి సాయం లేకుండా కదలడం కానీ, తినడం కానీ.. తాగడం కానీ చేయలేని పరిస్థితి అతని కూతురుది. దీంతో అమె సపర్యలన్నీ బిపిన్ భార్య చూసుకునేది. అయితే గత కొంతకాలం క్రితం అమె కూడా మంచాన పడింది. దీంతో తమ బిడ్డ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. వీరిద్దరినీ చూసుకునే బాధ్యత తనపై పడింది. కాగా, తాను పనికి వెళ్లకపోతే వారికి బోజనం పెట్టే పరిస్థితి కూడా లేదు. దీంతో తాను పనికి వెళ్లి ఇంట్లో బిడ్డకు తినిపించేందుకు ఓ మనిషిని ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. అయితే అందుకు అతని భార్య సమస్మతించలేదు. తన కూతురు బాధ్యతను వేరేవాళ్లకు అప్పగించరాదని అమె కోరింది.
ఒక్క రోజు, రెండు రోజులు బాగానే చూసుకుని తినిపించినా.. ఆ తరువాత వారు విసుగుకోవడం చేస్తారని చెప్పింది. దీంతో అదీ నిజమేనని బావించిన అమె భర్త.. తన బిడ్డకు అన్నం తినిపించేందుకు ఓ రోబోనే తయారు చేయాలని పూనుకున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తన కూలీ పని చేస్తూనే.. ఆ తరువాత ఇలాంటి రోబోలు ఎక్కడైనా లభిస్తాయా అని వెతికాడు. అయితే రోబోలు ఉన్నాయి కానీ ప్రత్యేకంగా అన్నం తినిపించే రోబోలు మాత్రం లేవని తెలుసుకున్నాడు. ఇక ఇలాంటి ఓ రోబోను తానే తయారు చేయాలని భావించా డు. అందుకోసం రోబోను తయారు చేయడం ఎలా అన్న విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు.
తన బిడ్డకు ఆన్నం తినిపించే రోబోను తయారు చేశాడు. దానికి అమ్మ రోబో అంటూ నామకరణం చేశాడు. తన బిడ్డకు ఈ రోబోనే కొంతకాలంగా అన్నం తినిపిస్తోంది. ఇది క్రమంగా బయటి వ్యక్తులకు తెలియడంతో అలా క్రమక్రమంగా వైరల్ న్యూస్ గా మారింది. గోవాలోని దక్షణి ప్రాంతంలోని పాండా తాలుకాలో బెహరా గ్రామానికి చెందని బిపిన్ కదమ్ ఈ అమ్మరోబోతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పోందుతున్నాడు. ఎటువంటి సాఫ్ట్ వేర్ అవగాహలేని ఓ సాధారణ కూలి రోబోటిక్ ఇంజనీర్లు తయారుచేయగలిగే రోబోను తయారు చేయడం అంటే మాటలు కానేకాదు. అందుకే బిపిన్ టెక్ దిగ్గజాలకే ఆదర్శంగా నిలిచాడు.
బిపిన్ నాలుగు నెలల్లోనే పరిశోధనకు ప్రతిఫలంగా అతని కష్టం తీరింది. బిడ్డకు అన్నం తినిపించటానికి ఓ రోబో రూపొందింది. పెద్దగా చదువుకోని బిపిన్ కూలికి వెళ్లి తిరిగి రాత్రికి ఇంటికొచ్చాక రోబోను తయారుచేయడం ఎలా అన్నదానిపై నాలుగు నెలలపాటు పరిశోధన చేశాడు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుని..దానిపై అవగాహన పెంచుకున్నాడు. అలా నాలుగు నెలలు కష్టపడి ఓ రోబోను తయారుచేశాడు. పూర్తిగా వాయిస్ కమాండ్తో పనిచేస్తున్న ఈ రోబో తన బిడ్డకు ఆకలేసిన ప్రతీసారి బోజనాన్ని పెడుతోంది. దాని చేతిలో ఆహారం ఉన్న పళ్లెం పెడితే అది కలిపి కుమార్తెకు తినిపించేలా డిజైన్ చేశాడు బిపిన్.
తన బిడ్డకు కూర నచ్చకపోవడం వల్ల అన్నం తినకపోతే ఎలా.. అని దానికి కూడా పరిష్కారం కనుక్కున్నాడు బిపిన్. వాయిస్ కమాండ్ ద్వారా ఆహారాన్ని ఏ కూరతో కలిపి తినిపించాలో చెబితే రోబో అదే చేసేలా డిజైన్ చేశాడు. అచ్చం అమ్మలాగా. అందుకే మామ్ రోబో అని పేరు పెట్టాడీ క్రియేటర్. ఈ రోబో విజయవంతంగా పనిచేస్తుండడంతో బిపిన్ ఆనందానికి హద్దే లేకుండాపోయింది. తన బిడ్డలాంటి పరిస్థితి ఉన్నవారు ఎవరైనా కోరితే ఇటువంటి రోబోలు తయారు చేస్తానంటున్నాడు. ఇక బిపిన్ ఘనత ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గోవా స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ బిపిన్పై ప్రశంసలు కురిపించింది. ఆయన తయారు చేసిన ‘మా రోబో’ను వాణిజ్య పరంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more