కంచే చేను మేసిందన్న చెందంగా తాను పనిచేస్తున్న సంస్థకే కన్నం పెట్టిన ఘనుడితను. సంస్థలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి అదే సంస్థకు కుచ్చుటోపి పెట్టి పారిపోయిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రతిరోజు ఏటీయం కేంద్రాలలో డబ్బులు పెట్టడమే కానీ.. వాటిని తనకోసం అంటూ వాడుకోవాలని అనుకున్నాడో ఏమో కానీ ఏకంగా ఏటీఎం కేంద్రాలలో నింపాల్సిన పెద్ద మొత్తంలోని నగదుతో ఉడాయించాడు. వ్యాను డ్రైవర్ ఎత్తుకెళ్లిన డబ్బు మొత్తం రూ.60 లక్షల వరకు ఉంటుందని సదరు బ్యాంకు అధికారులు గుర్తించారు.
ఈ ఘటన కడప జిల్లాలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్నది. నగదుతో పారిపోయిన వ్యాన్ డ్రైవర్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. కడప నగరంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న ఓ బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో నగదును నింపే బాధ్యతను ఒక ఏజెన్సీకి ఇచ్చింది. నిత్యం సదరు ఏజెన్సీ సిబ్బంది ఆయా ఏటీఎంలలో నగదు నిల్వలను సరిచూస్తుంటారు. అయితే, శుక్రవారం బ్యాంకు నుంచి రూ.80 లక్షల నగదు తీసుకుని వాహనంలో ఏజెన్సీ సిబ్బంది బయలుదేరారు. ఐటీఐ సర్కిల్లోని బ్యాంకు ఏటీఎం వద్దకు సిబ్బంది వెళ్లగా.. ఇదే అదనుగా వ్యాను డ్రైవర్ షారుఖ్ వాహనంతో పరారయ్యాడు.
డ్రైవర్ షారుఖ్ పట్టుకెళ్లిన వాహనంలో దాదాపు రూ.60 లక్షల వరకు నగదు ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. నగర శివారులోని వినాయకనగర్ వద్ద డ్రైవర్ వ్యానును వదిలిపెట్టి నగదును సంచుల్లో వేసుకుని పరారైనట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. బ్యాంకు అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఐటీఐ సర్కిల్ నుంచి శివారులోని వినాయకనగర్ వరకు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని కడప ఎస్పీ చెప్పారు. డ్రైవర్ షారుఖ్కు సంబంధించిన వివరాలను ఆరా తీసేందుకు, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more