దాయాది పాక్లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. కరాచీ నగరంలోని హిందూ దేవాలయంలోని దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన కరాచీలోని కోరంగి నెంబర్-5 ప్రాంతంలో జరిగింది. శ్రీమరిమాత ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. బుధవారం రాత్రి సమయంలో దుండగులు ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో హిందువులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటన అనంతరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులను మోహరించారు.
ఆరు నుంచి ఎనిమిది మంది దుండగులు మోటార్ సైకిళ్లపై ఆలయం వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డారని స్థానికుడు తెలిపాడు. గత కొద్ది రోజులుగా పాక్లోని హిందూ దేవాలయాలే లక్ష్యంగా దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. అక్టోబర్లో సింధు నది ఒడ్డున ఉన్న ఓ చారిత్రాత్మక దేవాలయంపై దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. అధికారిక అంచనాల ప్రకారం, పాక్లో 7.5 మిలియన్ల మంది హిందువులు నివసిస్తున్నారు. అయితే, కమ్యూనిటీ ప్రకారం దేశంలో 90 లక్షల మంది హిందువులు ఉన్నారు. పాకిస్తాన్లోని హిందూ జనాభాలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్లో స్థిరపడ్డారు.
Hindu Temple priest house attacked by some Militants in Korangi 5 Karachi
— Mirza (@Mirza45994191) June 9, 2022
Militant Mob vandalises the house & broke the Mortis. Shri Mari Maata Mandir was attacked on Wed late night causing fear amongst the Hindu community.
No arrests have been made by Pak Police. #Karachi pic.twitter.com/bxmYD5QxWw
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more