మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును చేపట్టిన సిబీఐ.. తమ విచారణను అన్ని కోణాల్లో వేగం చేసింది. ఈ క్రమంలో వైఎస్ వివేకా హత్యకు గురైనప్పుడు ఆయన రాసిన లేక.. వెలుగుచూసిన లేఖపై కూడా సీబిఐ విచారణ జరిపింది. ఇందుకోసం ఆయన ఏలాంటి సందర్భంలో లేఖను రాశారన్న విషయాన్ని సిబిఐ ఫోరెన్సిక్స్ ల్యాబ్ ద్వారా తెలుసుకున్నారు. వైఎస్ వివేకాపై దాడికి పాల్పడుతూ.. ఆయనను కొడుతూ.. ఆయన అభిష్టానికి విరుద్దంగా ఈ లేఖ రాయించినట్టు ఉందని సీబిఐ పేర్కోంది. వైఎస్ వివేకాపై ఒత్తిడి తీసుకువచ్చి.. బలవంతంగా రాయించినట్టు ఫోరెన్సిన్ నిపుణులు ఇచ్చిన నివేదిక స్పష్టం చేస్తోందని సీబిఐ కోర్టులో ఆ నివేదికను సమర్పించింది.
తప్పనిసరి పరిస్థితులు, ఇతరుల ఒత్తిడి మధ్య ఆయన ఈ లేఖ రాసినట్లు ఉందని న్యాయస్థానానికి సిబిఐ వివరించింది. అందుకే చేతిరాత అస్పష్టంగా, గజిబిజిగా కనిపిస్తోందని తెలిపింది. లేఖలోని చేతిరాతను ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్సు ప్రయోగశాలలో సైకలాజికల్ విశ్లేషణ చేయించిన సీబీఐ అధికారులు ఆ సంస్థ జారీ చేసిన నివేదికను న్యాయస్థానంలో సమర్పించారు. వైఎస్ వివేకా హత్యకేసులో ఇటీవల దాఖలుచేసిన అభియోగపత్రంతో పాటు ఆ నివేదికనూ న్యాయస్థానానికి సీబీఐ సమర్పించింది. ఈ లేఖ రాసే సమయంలో ఆయన మెదడుకు పెన్నుకూ మధ్య సమన్వయం లేదని.. బలవంతంగా రాసినట్లు, తీవ్ర ఒత్తిడి, బలవంతం మధ్య ఇది జరిగినట్లు ఉందని తెలిపింది.
ఈ కారణంగా రాసే సమయంలో ఆయన చేయి వణుకిందని కూడా నివేదికలో స్పష్టమైందని, దీని ఫలితంగానే లేఖలో అక్షరాలు కూడా క్రమపద్దతిలో లేవని అన్నారు. కాగితంపై పెన్ను ఒత్తిడి ఒక్కోచోట ఒక్కోలా ఉంది. పదాలు, వరుసల మధ్య పొంతన లేదు. అక్షరాలు కొన్నిచోట్ల చిన్నవిగా, మరికొన్ని చోట్ల పెద్దవిగా ఉన్నాయి. వివేకానందరెడ్డి అసలైన సంతకంతో సరిపోల్చి చూసినప్పుడు లేఖలోని సంతకం భిన్నంగా ఉంది. ఆయన తన సంతకంలో తొలుత ఇంటిపేరు చేర్చి వై.ఎస్.వివేకానందరెడ్డి అని పెడతారు. కానీ లేఖలో వివేకానందరెడ్డి అని మాత్రమే.. అదీ అస్పష్టంగా ఉంది. స్పృహ లేని పరిస్థితుల్లో లేఖ రాసినట్లు అనిపిస్తోందని నివేదిక వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more