కరోనా మహమ్మారిని నియంత్రించి మనషిపై ఎలాంటి ప్రభావం చూపకుండా చేసేందుకు గత రెండేళ్లుగా వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కరోనా కట్టడిపై విస్తృతస్థాయిలో రీసర్చ్ జరుపుతున్నాయి. ఇందులో భాగంగానే తొలుత కరోనాకు మందును, ఆ తరువాత కరోనా దరిచేరకుండా వాక్సీన్ ను కూడా వైద్యనిపుణులు తీసుకువచ్చారు. ఇక తాజాగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు ఆసక్తికర పరిశోధన చేపట్టారు. సరికొత్త యాంటీబాడీని అభివృద్ధి చేశారు. మానవ కణాల్లో ఒకదాని నుంచి మరొకదానికి వ్యాపించకుండా కరోనా వైరస్ ను ఇ విజయవంతంగా అడ్డుకుంటుంది. దీనికి ఫుజి1 (FuG1)గా నామకరణం చేశారు.
మానవ కణాల్లోకి చొరబడేందుకు కరోనా వైరస్ క్రిములు వినియోగించే ఫ్యురిన్ అనే ఎంజైమును ఈ కొత్త యాంటీబాడీ నాశనం చేస్తుంది. తద్వారా కరోనా వైరస్ గొలుసును తెంచేస్తుంది. ఫ్యురిన్ సాధారణంగా మానవ దేహంలో విరివిగా ఉంటుంది. ఇది ప్రొటీన్లను సైతం చిన్న ముక్కలుగా విడగొట్టగలిలే శక్తిని కలిగి ఉంటుంది. ప్రొటీన్లను ఆవరించి ఉండే పాలీబేసిక్ పెప్టైడ్ కవచాలను సైతం ఇది ఛేదిస్తుంది. అందువల్లే కరోనా క్రిములు ఈ ఫ్యురిన్ ఎంజైమును ఉపయోగించుకుని శరీరంలోని ప్రతి అవయవంలోనూ వరుసగా ఇన్ఫెక్షన్లను కలుగచేస్తాయి. అయితే కొత్త యాంటీబాడీ ద్వారా ఫ్యురిన్ ఎంజైము కార్యకలాపాలు పూర్తిస్థాయిలో అచేతనావస్థకు తీసుకెళ్లవచ్చని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు.
ఈ యాంటీబాడీ పనితీరును మైక్రోబయాలజీ స్పెక్ట్రమ్ అనే సైన్స్ పత్రికలో ప్రచురించారు. ఈ కొత్త యాంటీబాడీ (FuG1)ని గనుక ఇప్పటికే కరోనా చికిత్సలో వినిగియోస్తున్న సార్స్ కోవ్-2 కరోనా కాక్ టెయిల్ ఔషధాలకు జోడిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన జోగేందర్ తుషీర్ సింగ్ అనే పరిశోధకుడు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్లు ప్రజలను ఆసుపత్రి పాలవ్వకుండా కాపాడుతున్నాయని, అయితే, కరోనా వ్యాప్తిని సమర్థంగా అరికట్టడంలో వ్యాక్సిన్లు ఏమంత ప్రభావశీలత కనబర్చవని అభిప్రాయపడ్డారు. తాము అభివృద్ధి చేసిన యాంటీబాడీ ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ఉపయోగకారి అవుతుందని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more