COVID-19 tally in India sees biggest jump దేశంలో శరవేగంగా వ్యాపిస్తున్న కరోనా.. 24 గంట్లలో 9851

Coronavirus update india sees biggest jump in covid 19 count 9851 new cases in last 24 hours

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

India witnessed the biggest jump in daily coronavirus count with 9,851 people testing positive for the novel virus in last 24 hours. The total number of coronavirus cases in the country increased to 226,770, The fatalities from coronavirus pandemic crossed the grim milestone of 6,348-mark.

దేశంలో శరవేగంగా వ్యాపిస్తున్న కరోనా.. 24 గంట్లలో 9851

Posted: 06/05/2020 04:00 PM IST
Coronavirus update india sees biggest jump in covid 19 count 9851 new cases in last 24 hours

(Image source from: Deccanherald.com)

దేశంలో కరోనా విజృంభన మరింత వేగాన్ని అందుకుంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ.. లక్షలాధి మందిని తన ప్రభావానికి గురిచేస్తూ.. లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి దేశంలోనూ తన ఉదృతిని శరవేగంగా విస్తరించుకుంటోంది. రోజురోజుకు ప్రజల మనుగడనను ప్రశ్నార్థకంగా మారుస్తూ తన ప్రభావనికి గురిచేస్తున్న వైరస్.. ఇక తన వ్యాప్తిని కూడా పెంచుకుంటోంది. దేశంలో జనవరి 30న తొలి కేసు నమోదైన తరువాత విడతల వారీగా లాక్ డౌన్ విధిస్తూ చర్యలు తీసుకుంటున్న కేంద్ర,రాష్ట ప్రభుత్వాలు కరోనాను కీలక దశలో కట్టడి చేశాయి. ఇక అర్థిక ప్రగతి కుంటుపడుతున్న నేపథ్యంలో సడలింపులతో వెసలుబాటు కల్పించగానే.. వరుసగా రోజురోజుకు అత్యధిక కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది.

గత కొన్ని రోజులుగా ఏకంగా ఎనమిది వేలకు పైబడిన సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా, ఇక తాజగా ఇవాళ ఏకంగా పది వేలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో క్రమంగా కరోనా వైరస్ మహమ్మారి బారిన బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతీ రోజు రెండు వందలకు పైబడే మరణాలు నమోదు కావడం కూడా అందోళన వ్యక్తం అవుతోంది. అటు దేశవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలు కూడా అందోళన కలిగించే స్థాయికి చేరువవుతున్నాయి. ఐదో విడత లాక్ డౌన్ అమల్లోకి రావడంతో దేశంలో అన్నింటికీ సడలింపులు వచ్చాయి. దీంతో కరోనా కేసులు వ్యాప్తి కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 9851 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 2,26,770 కేసులు నమోదయ్యాయి.

ఇక దేశంలో నమోదవుతున్న మరణాలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి. దేశంలో మునుపెన్నడూ నమోదు కాని స్థాయిలో మరణాలు సంభవిస్తూ ప్రజలను అందోళనకు గురచేస్తున్నాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో 273 మంది మరణించడం అందోళన కలిగించే విషయం. ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇది మూడో పర్యాయం. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 6300 మార్కును దాటింది. తాజాగా నమోదైన గణంకాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 6348కి మరణాలు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల్లో  మహారాష్ట్రలోనే అత్యదికంగా నమోదు కావడం గమనార్హం. ఆ తరువాత కరోనా విజృంభన ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోనూ అత్యధిక కేసులు నమోదయ్యాయి.

ఈ మహమ్మారి బారిన పడిన వారిలో గత 24 గంటల వ్యవధిలో పలువురు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 1,09,462 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 1,10,960 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గత కొన్నిరోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో 48శాతానికి చేరిందని.. ఇది అత్యధికమని ఐఎంసీఆర్ గణంకాలు స్పష్టంచేస్తున్నాయి.

మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 2933 కేసులు నమోదయ్యాయి, ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనే 1067 పాజిటివ్ కేసులు నమోదు అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది, గత సోమవారం నుంచి మహారాష్ట్రంలో అత్యధిక కరోనా మరణాలు సంభవించడం అందోళనకరం. దేశంలో నమోదైన కేసుల్లో దాదాపు 36శాతం కరోనా కేసులు మహరాష్ట్ర నుంచినమోదు కావడం.. రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య 77793కు చేరగా, ఏకంగా 2710 మార్క దాటి మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవవధిలో మహారాష్ట్రలో 85 మరణాలు సంభవించాయి. 

ఆ తరువాత కరోనా ఉదృతి అధికంగా నమోదవుతున్న తమిళనాడులో గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 1384 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసులు సంఖ్య 27256కు చేరాయి. ఆ తరువాత దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కాటువేస్తోంది. ఇక్కడ నిన్న ఒక్కరోజునే 1359 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 25004 చేరగా, మొత్తంగా 650 మంది కరోనా బారిన పడి మరణించారు. ఆ తరువాత గుజరాత్ లోనూ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ రాష్ట్రంలో నమొత్తం కేసులు సంఖ్య 18,584కి చేరగా, ఏకంగా 1155 మంది అసువులు బాసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles