కరోనావైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక దేశాలు తమ తమ స్థాయిలో అధ్యయనాలు చేస్తున్నాయి. కరో్నా ఎలా వ్యాప్తి చెందుతుంది. దీనిని నివారించే వాక్సీన్ కోసం కూడా పరిశోధనలు సాగుతున్నాయి, ఈ నేపథ్యంలో యూనైటెడ్ కింగ్ డమ్ కు చెందిన సర్రే విశ్వవిద్యాలయం చేసిన ఓ అద్యయనం కరోనా నివారణకు వెంటిలేషన్ సరిగ్గా వుండాల్సిన అవసరం వుందని వెల్లడైంది. కరోనాకు వ్యాప్తి నేపథ్యంలో దేశాలన్నీ లాక్ డౌన్ ఫ్రకటించి ప్రజల్ని ఇళ్లుకు మాత్రమే పరిమితం చేస్తున్న తరుణంలో.. తాజా అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రజలు వారి నివసిస్తున్న ఇళ్లు, పనిచేస్తున్న కార్యాలయాల్లో, వ్యాపార కేంద్రాలు, ఎక్కడైనా సరే.. సవ్యంగా గాలి ప్రసరణ జరగాలని.. వెలుతురు కూడా ఇంట్లోకి రావాలని అలా కాని పక్షంలో.. కరోనా వైరస్ను కొనితెచ్చుకున్నట్టేనని సర్రే యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రశాంత్ కుమార్ తెలిపారు. సక్రమంగా గాలి, వెలుతురు వచ్చి వెంటిలేషన్ కూడా సవ్యంగా వుంటే.. ఇంట్లోకి చేరిన కరోనా వైరస్ కూడా బయటకు వెళ్తుందని చెబుతున్నారు. అలా కాకుండా వెంటిలేషన్ ను మూసివేసినా.. లేక సరైన వెంటిలేషన్ లేకపోయినా కరోనా ఇళ్లు, కార్యాలయాల్లో తిష్టవేసే ముప్పు పోంచివుందని అంటున్నారు.
తుమ్ము, దగ్గు, నిశ్వాసల ద్వారా బయటకు వచ్చే సూక్ష్మ బిందువుల్లో నుంచి నీరు క్రమంగా ఆవిరైపోతుందని, కానీ వైరస్ కణాలు మాత్రం అక్కడే ఉండిపోతాయని తమ అధ్యయనంలో తేలినట్టు పేర్కొన్నారు. దీంతో వెంటిలేషన్ సక్రమంగా వుంటే వైరస్ బయటకు వెళ్తుందని తెలిపారు. గదులు, కార్యాలయాల్లో ఏసీలు ఉన్నప్పటికీ వాటి పనితీరు సక్రమంగా లేకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్టేనని వివరించారు. అందుకే వెంటిలేషన్ సక్రమంగా వుండేలా చూసుకోవాలని, లేకుంటే కరోనా ముప్పు తప్పదని హెచ్చరించారు. కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఈ విషయంపై తక్షణం దృష్టి సారించాలని సూచించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more