ఇన్నాళ్లు దేశంలో నెమ్మెదిగా వ్యాప్తి చెందిన కరోనా వైరస్.. గడిచిన 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి దేశంపై తన పంజా విసురుతొంది. దేశంలో లాక్ డౌన్ ను పొడగిస్తూ నిర్ణయం తీసుకుని గ్రీన్, అరేంజ్, రెడ్ జోన్లలో పలు మినాహాయింపులు జారీ చేసిన రోజునే అత్యధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది, ఒక్కరోజులో అత్యధికంగా 2293 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఈ స్థాయిలో కరోనా కేసులు ఒక్కరోజులో బయటపడటం ఇదే అత్యధికం.
మరోవైపు కరోనా బారిన పడి అసువులు బాస్తున్నవారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 71 మరణాలు సంభవించడంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1218కు చేరడం కూడా అందోళన కలిగించే అంశం. లాక్ డౌన్ అమల్లో వుండగానే ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతుండటం కూడా దిగ్ర్భాంతికి గురిచేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37 వేల మార్కు దాటింది. దేశవ్యాప్తంగా మొత్తం 37 వేల 336 మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రకు చెందిన వారే కావడం గురికావడం, ఇప్పటికీ అక్కడ పరిస్థితి అదుపులోకి రాకపోడం గమనార్హం.
ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 9951 మంది కోలుకున్నారని చెప్పారు. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. మహరాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య ఏకంగా 11 వేల మార్కు దాటింది. ఇక మృతుల సంఖ్య కూడా 485కు చేరింది. ఇక కరోనా వ్యాధి నుంచి కొలుకున్న వారి సంఖ్య కూడా 1879కి చేరింది. ఆ తరువాత గుజరాత్ లో 4721 కేసులు నమోదవ్వగా 236 మంది మృత్యువాతపడ్డారు, 735 మంది కరోనా నుంచి కొలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more