దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులో అత్యధికంగా 1718 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓ వైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండగా, మరోవైపు కరోనా బారిన పడి అసువులు బాస్తున్నవారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 67 మరణాలు సంభవించడంతో పాటు ఏకంగా దేశంలో వెయ్యి సంఖ్య దాటి మరణాలు నమోదుకావడం అందోళన కలిగించే అంశం. లాక్ డౌన్ అమల్లో వుండగానే ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతుండటం కూడా దిగ్ర్భాంతికి గురిచేస్తోంది.
ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1718 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ్టి ఉదయానికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల 33 వేల మార్కు దాటింది. దేశవ్యాప్తంగా మొత్తం 33 వేల 050 మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. ఇక తాజాగా కరోనా మహమ్మారి బారిన పడి అసువులు బాసిన వారి సంఖ్య కూడా వెయ్యి మార్కు దాటింది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 67 మందిని పోట్టన బెట్టుకుంది. దీంతో మరణాల సంఖ్య కూడా 1074కు చేరింది. వీరిలో అత్యధికంగా మహారాష్ట్రకు చెందిన వారే కావడం గమనార్హం.
ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 8324 మంది కోలుకున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా కరోనా బారినపడి చికిత్స పోందుతున్న వారి సంఖ్య 23, 651గా నమోదైంది. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 31 మంది, గుజరాత్ లో 19 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రస్తుతం మొత్తం బాధితుల్లో 7696 మంది కోలుకోగా మరో 22,629 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వైరస్ బారినపడి కోలుకుంటున్న వారిశాతం 24.56గా ఉండటం ఊరటకలిగిస్తోంది.
దేశంలో అత్యధికంగా కొవిడ్-19 తీవ్రత మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఈ ఒక్క రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పది వేల మార్కు చేరువలో వున్నాయి, ఇప్పటివరకు 9915 పాజిటివ్ కేసులు నమోదుకాగా మరణాల సంఖ్య కూడా 432 మార్కు దాటింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 32 మరణాలతోపాటు 597 పాజటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య పది వేల మార్కుకు చేరువలో కొనసాగుతుంది, ఏకంగా రాష్ట్రంలో 9915 మంది కోవిడ్ బారిన పడగా 432 మంది మృత్యువాతపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈ వైరస్ తీవ్రత ఆందోళనకరంగా ఉంది. పుణె, నాగ్పూర్లో కూడా కేసుల సంఖ్య ఎక్కువగా నమోదువుతున్నాయి.
మహారాష్ట్ర అనంతరం అత్యధికంగా కరోనా మరణాలు గుజరాత్లో చోటుచేసుకుంటున్నాయి. గుజరాత్లో మొత్తం కేసుల సంఖ్య 4082కి చేరగా వీరిలో ఇప్పటివరకు 197మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్లోనూ కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 2561 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 129మంది మరణించారు. దేశ రాజధాని దిల్లోలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3439 మందికి కరోనా సోకగా 56మంది మరణించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more