దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఓ వైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండగా, మరోవైపు కరోనా బారిన పడి అసువులు బాస్తున్నవారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో మరణాలు అందోళన కలిగించే స్థాయిలో నమోదవుతున్నాయి. అటు కేంద్రం అరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖతో పాటు ఇటు రాష్ట్రాలు కూడా కోవిడ్ మరణాల నమోదుపై అందోళన చెందుతున్నాయి. దేశంలో ఈ వైరస్ మహమ్మారి వ్యాప్తిన కట్టిడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా వ్యాప్తి చెందడంతో పాటు మరణాలను కట్టడి కావడం లేదు తాజాగా గడిచి, 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 62 మరణాలు సంభవించాయి.
ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా పదిహేను వందల నలబై మూడు కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇవాళ ఉదయానికి దేశంలో నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 934కు చేరింది. కరోనా కేసుల సంఖ్య సుమారుగా 29 వేల మార్కును దాటిందని వెల్లడించింది. ఇవాళ్టి ఉదయానికి 29, 435 మంది ఈ మహమ్మారి ప్రభావానికి గురయ్యారు. ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 6869 మంది కోలుకున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా కరోనా బారినపడి చికిత్స పోందుతున్న వారి సంఖ్య 21, 632గా నమోదైంది. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది.
గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 62మరణాలు సంభవించడంతోపాటు కొత్తగా 1543 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29,435కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 934మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రస్తుతం మొత్తం బాధితుల్లో 6869 మంది కోలుకోగా మరో 21,632 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వైరస్ బారినపడి కోలుకుంటున్న వారిశాతం 23.33గా ఉండటం ఊరటకలిగిస్తోంది.
దేశంలో అత్యధికంగా కొవిడ్-19 తీవ్రత మహారాష్ట్రలో కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8590 పాజిటివ్ కేసులు నమోదుకాగా 369మంది మృత్యువాతపడ్డారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 522కేసులు నమోదయ్యాయి. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈ వైరస్ తీవ్రత ఆందోళనకరంగా ఉంది. పుణె, నాగ్పూర్లో కూడా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మహారాష్ట్ర అనంతరం అత్యధికంగా కరోనా మరణాలు గుజరాత్లో చోటుచేసుకుంటున్నాయి.
రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3548కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 162మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్లోనూ కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 2168 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 110మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లోలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3108 మందికి కరోనా సోకగా 54మంది మరణించారు. ఇక దేశంలో ఢిల్లీ తరువాత కోవిడ్ కేసులు వెలుగుచూసిన తెలంగాణలో కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more