India records 1,396 new Covid-19 cases, 48 deaths దేశంలో 24 గంటల్లో 48 కరోనా మరణాలు..

Coronavirus india records 1 396 new covid 19 cases 48 deaths in last 24 hours

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

There were 1,396 new cases of the coronavirus disease (Covid-19) and 48 deaths across the country in the last 24 hours, India’s tally of the coronavirus disease stands at 27,892—including 20,835 active cases, 6185 cured, discharged or migrated and 872 deaths, according to the health ministry’s dashboard.

దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు.. 24 గంటల్లో 48 మరణాలు

Posted: 04/27/2020 12:00 PM IST
Coronavirus india records 1 396 new covid 19 cases 48 deaths in last 24 hours

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. అంతేకాదు కరోనా బారిన పడి అసువులు బాస్తున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే వుంది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో మరణాలు అందోళన కలిగించే స్థాయిలో నమోదవుతున్నాయి. అటు కేంద్రం అరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖతో పాటు ఇటు రాష్ట్రాలు కూడా కోవిడ్ మరణాల నమోదుపై అందోళన చెందుతున్నాయి. దేశంలో ఈ వైరస్ మహమ్మారి వ్యాప్తిన కట్టిడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా వ్యాప్తి చెందడంతో పాటు మరణాలను కట్టడి కావడం లేదు  తాజాగా గడిచి, 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 48 మరణాలు సంభవించాయి.

ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా పదమూడు వందల తొంబైఆరు కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇవాళ ఉదయానికి దేశంలో నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 872 కు చేరింది. కరోనా కేసుల సంఖ్య సుమారుగా 27 వేల మార్కును దాటిందని వెల్లడించింది. ఇవాళ్టి ఉదయానికి 27, 892 మంది ఈ మహమ్మారి ప్రభావానికి గురయ్యారు. ఈ వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 6185 మంది కోలుకున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా కరోనా బారినపడి చికిత్స పోందుతున్న వారి సంఖ్య 20, 835గా నమోదైంది.  గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది.

దీంతో దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 27892కు చేరకుంది. గడిచిన 24 గంటల వ్యవధితో దేశవ్యాప్తంగా 1396 పాజిటివ్ కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ వైరస్ సోకి తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 48 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య కూడా 872 కు చేరుకుంది. మొత్తం బాధితుల్లో 6185 మంది వ్యాది నుంచి కోలుకున్నట్లు ప్రకటించింది.

దేశంలో అత్యధికంగా కొవిడ్‌-19 తీవ్రత మహారాష్ట్రలో కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8068 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 342మంది మృత్యువాతపడ్డారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 440కేసులు నమోదయ్యాయి. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈ వైరస్‌ తీవ్రత ఆందోళనకరంగా ఉంది. పుణె, నాగ్‌పూర్‌లో కూడా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మహారాష్ట్ర అనంతరం అత్యధికంగా కరోనా మరణాలు గుజరాత్‌లో చోటుచేసుకుంటున్నాయి.

రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3301కి చేరింది. వీరిలో 151మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లోనూ కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 2096 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 103మంది మరణించారు. దేశ రాజధాని దిల్లోలోనూ కరోనా తీవ్రత పెరుగుతోంది. కేవలం నిన్న ఒక్కరోజే ఇక్కడ 293కొవిడ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 2918 చేరగా 54మంది మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles