దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దాని ప్రభావం దాటికి కొలుకునేవారి సంఖ్య భారీగానే వున్నా అసువులు బాస్తున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరగడం అందోళనకలిగిస్తోంది. దేశంలో ఈ వైరస్ మహమ్మారి వ్యాప్తిన కట్టిడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా వ్యాప్తి చెందడంతో పాటు మరణాలను కట్టడి కావడం లేదు తాజాగా గడిచి, 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 37 మరణాలు సంభవించడం కలవరానికి గురిచేస్తూనే ఉంది. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా పదహారు వందల 84 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దీంతో ఇవాళ ఉదయానికి దేశంలో నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 717కు చేరింది. కరోనా కేసుల సంఖ్య సుమారుగా 23 వేల మార్కుకు చేరిందని వెల్లడించింది. ఇవాళ్టి ఉదయానికి 23 వేల మంది ఈ మహమ్మారి ప్రభావానికి గురయ్యారు. ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 4749 మంది కోలుకున్నారని చెప్పారు. ప్రతి 24 శాంపిళ్లలో 1 కరోనా పాజిటివ్ కేసు నమోదవుతోందని తెలిపిన అధికారులు.. దేశవ్యాప్తంగా కరోనా బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్యకూడా అధికంగానే వుందని తెలిపింది. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది.
దీంతో దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 23.077కి చేరకుంది. గడిచిన 24 గంటల వ్యవధితో దేశవ్యాప్తంగా పదహారు వందల 84 పాజిటివ్ కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ వైరస్ సోకి నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 681 మంది మరణించగా తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 37 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య కూడా 700 దాటింది. పైరస్ మహమ్మారి మరణాల సంఖ్య 718కి చేరుకుంది. మొత్తం బాధితుల్లో 4749 మంది వ్యాది నుంచి కోలుకున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి శాతం 19.89గా నమోదైయ్యిందని ప్రభుత్వం తెలిపింది.
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతొంది. రాష్ట్రంలో కొవిడ్ సోకి ఇప్పటి వరకూ 283మంది మృత్యువాతపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 6430 చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఇక గుజరాత్లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే ఒక్కడ ఈ వైరస్ బారినపడి 112మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 2624కి చేరింది. మధ్యప్రదేశ్లోనూ కరోనాతో మరణించే వారిసంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక్కడ ఈ వైరస్కు 83మంది బలయ్యారు. ఢిల్లీలోనూ కరోనా వైరస్తో ఇప్పటివరకు 50 మంది మరణించారు. కేసుల సంఖ్య 2376కు చేరింది. దేశంలో ఏడురాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేయి దాటింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more