అంగవైకల్యం వున్నవారు తమకున్న ఆ లోపాన్ని గుర్తుంచుకుని నిత్యం ఆవేదన చెందుతుంటారు. నలుగురిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేమన్న బాధ వారిని వెంటాడుతూ వుంటుంది. అయితే.. లక్ష్యాన్ని ఛేధించడానికి అంగవైకల్యం అడ్డురాదని తమ ప్రతిభతో నిరూపించిందో భారతీయ ధీరవనిత! ఆ సమస్యతో కుమిలిపోతున్న వారందరికీ ఆదర్శంగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటుకుంది. ఆమే మాలతి కృష్ణమూర్తి హొళ్ళ. 14 నెలల వయస్సులోనే వైరల్ జ్వరంతో శరీరమంతా పక్షవాతంతో చచ్చుబడిపోయిన ఆమె... జాతీయ స్థాయిలో సుమారు 300 స్వర్ణ, కాంశ్య పతకాలు గెల్చుకోగలిగింది. ఈమె ప్రతిభను గుర్తించిన కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం.. 1999లో ‘విశ్వశ్రేష్ట మహిళ’గా గౌరవించింది.
జీవిత చరిత్ర :
1958 జూలై 6న కర్ణాటకలోని ఉడిపి జిల్లా కోట గ్రామంలో మాలతి జన్మించింది. ఈమె తండ్రి హోటల్ నడుపుతుండేవారు. 14 నెలల వయస్సులో వుండగానే జ్వరం రూపంలో పాప పక్షవాతానికి గురికావడం కుటుంబసభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఆమెను మద్రాస్లోని అడయార్ ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రిలో చేర్పించారు. రెండు సంవత్సరాలు రకరకాల చికిత్సలు, కరెంట్ షాక్లూ ఇచ్చారు. అలా చికిత్సం అందించడంతో ఆమె శరీర పైభాగానికి శక్తి వచ్చింది. కాని క్రింది భాగంలో ఏ మార్పూ లేదు.
15 ఏళ్ళు ఆమె జీవితం హాస్పిటళ్ళు, ఆపరేషన్లు, డాక్టర్ల చుట్టూనే తిరిగింది. ఈ 15 ఏళ్లలో ఆమె 27 ఆపరేషన్లు చేయించుకుంది. ఎన్ని ఆపరేషన్లు చేసినా శరీరం క్రింద భాగంలో ఎటువంటి మార్పు రాకపోవడంతో శక్తి ఉన్న భాగంతోనే ఎన్నో తన చదువు కొనసాగించింది. హైస్కూల్ చదువు పూర్తి అయ్యేంతలో, మాలతి నడుము పైభాగం బలపడింది. ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ తన కాలేజీ విద్యను పూర్తి చేసింది. తండ్రి ప్రోత్సాహంతో, కాలేజీ యాజమాన్యం సహకారంతో ఆమె తనూ ఏదైనా చేయగలన్న నూతనోత్సాహంతో ముందుకు నడిచింది.
క్రీడా జీవితం
1975లో బెంగుళూరులో జరిగిన వికలాంగుల క్రీడాపోటీలలో మాలతి మొదటిసారి పాల్గొంది. అందులో ఆమె రెండు బంగారు పతకాలు సాధించి తన సత్తా చాటింది. అలాగే 100 మీటర్లు, 200వ మీటర్ల వీల్ఛేర్ పరుగు పందాలలో తన ప్రతిభ కనబరచింది. వీల్ ఛైర్లో కూచునే బ్యాడ్మింటన్, షాట్ ఫుట్ విసరటం, డిస్క్త్రో, జావ్లిన్ విసరటం వంటివి ప్రాక్టీస్ చేసి.. ఆ ఆటల పోటీల్లో అనేక బంగారు పతకాలు గెలుపొందింది.
1989లో డెన్మార్క్లో జరిగిన అంతర్జాతీయ పోటీలలో 4 బంగారు పతకాలు అందుకొంది. పలు దేశాలలో జరిగిన ఆటల పోటీలలో పాల్గొని ఇప్పటికీ 158 బంగారుపతకాలతోపాటుగా 20 రజితపతకాలుకూడా ఈమె సాధించింది. క్రీడారంగంలో అత్యధిక పతకాలను గెలుచుకొన్న వికలాంగ వ్యక్తిగా సరికొత్త రికార్డు సృష్టించింది. వికలాంగురాలైనప్పటికీ క్రీడారంగంలోని అనేక పోటీల్లో అద్భుతంగా ఈమె రాణించడాన్ని చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది.
ఈ విధంగా క్రీడారంగంలో తన సత్తాచాటిన ఈమెను 1999లో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం ‘విశ్వశ్రేష్ట మహిళ’గా గౌరవించింది. అలాగే భారత ప్రభుత్వం ఈమెను ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. క్రీడాశాఖ ‘అర్జున’ అవార్డుతో సత్కరించింది.
వ్యక్తిగత జీవితం :
ప్రస్తుతం ఈమె బెంగుళూరులోని బసవేశ్వర నగర సిండికేట్ బ్యాంక్ బ్రాంచ్లో ఆఫీసరుగా పనిచేస్తున్న ఈమె... వికలాంగుల కోసం ‘మాత్రు పౌండేషన్’ అనే పేరుతో ఆశ్రమం, క్రీడా శిక్షణ కేంద్రం నెలకొల్పి నిర్వహిస్తున్నారు. దీనిలో సుమారు 16 మంది వికలాంగ విధ్యార్దినీ, విద్యార్ధులు ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more