తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో తన హవా చాటుకుంటుంది. కానీ పార్టీలో నాయకులు మాత్రం ఓంటరిపోరుకు దిగుతున్నారు. దేశం పార్టీలో ఇంక అంతర్గత విభేదాలు రగులుతున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసేందుకు కూడా నాయకులు కలిసి రావడం లేదు. ప్రతీనాయకుడు ఎదో కారణం చెబుతూ ఉధ్యమాలకు డుమ్మా కోడుతుండడంతో కొంత మంది నేతలు ఒంటరిపోరుకు శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అదినాయకుడు నారాచంద్రబాబునాయుడు పార్టీని బలోపేతం చేసేందుకు అష్టకష్టాలు పడుతుంటే ఉత్తరాంధ్రా జిల్లాలో నేతలు మాత్రం చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు ఆ పార్టీ నుంచే బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన నాయకుడు వాసుపల్లి గణష్కుమార్కు అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించిన సమయంలోనే చాలా మంది నాయకులు వ్యతిరేకించారు. అయినప్పటికి వాసుపల్లి గణష్కుమార్ తనదైన శైలిలో కార్యక్రమాలు చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ చంద్రబాబు దృష్టిలో మంచి నాయకుడనిపించుకున్నారు. వస్తున్నా మీకోసం విజయోత్సవ సభ విశాఖనగరంలో భారీ ఎత్తున సఫలీకృతం కావడంతో ఎంతో మంది నేతల దృష్టి నగరంపై పడింది. అయితే పార్టీలో వెలుగు చూస్తున్న అంతర్గత విభేదాలు ఒక దశలో తొలగిపోతాయని బావించినప్పటికి పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పెద్దగా పట్టించుకోకపోయినప్పటికి తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానంతో కార్యకర్తలు పంచాయతీ ఎన్నికల్లో వారి సత్తాను చాటుకున్నారు. అయితే ఇటీవల అనేక కార్యక్రమాలకు అర్బన్ టిడిపి అధ్యక్షుడు వాసుపల్లి గణ ష్కుమార్ పిలుపునిచ్చారు. అయితే ఆయన ఏ కార్యక్రమం చేపట్టిన ఒంటరిగానే చేస్తున్నారు తప్ప నాయకులు కలిసి రావడం లేదన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. నగరంలో ఉన్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఏ కార్యక్రమానికి హాజరు కావడం లేదన్న విషయంపై ఆరోపణలకు స్పష్టత చేకూరుస్తున్నాయి. దీంతో పాటు అర్బన్ టిడిపిలో కీలక నేతలున్నారు. వారు కూడా కార్యక్రమాలకు హాజరు కాకపోవడంతో వాసుపల్లి గణష్కుమార్, కార్యకర్తలనే ఆయుధంగా వినియోగించుకొని ఆందోళనకు శ్రీకారం చుడుతున్నారన్న వాదనను కూడా ఆ పార్టీ కేడర్ నేరుగా చేస్తుంది. మరి ఈ విషయంలో రాష్ట్రాధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది వేచి చూడాలి.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more