Gurajada apparao kanyasulkam drama

gurajada apparao, gurajada apparao kanyasulkam, kanyasulkam drama, vijayawada, gurajada drama in vijayawada, mahakavi gurajada, 100years of kanyasulkam drama, tummalapalli kshetraiah kala kshetram,

gurajada apparao kanyasulkam drama

23.gif

Posted: 12/11/2012 04:53 PM IST
Gurajada apparao kanyasulkam drama

gura_2

        కళల ఖజానా విజయవాడలో కన్యాశుల్కం నాటకానికి మరోసారి ప్రేక్షకాభిషేకం జరిగింది. తెలుగు నాటకానికి ఎక్కడా ఆదరణ తగ్గలేదని నిరూపితమైంది. ఎప్పుడో 1892లో మహాకవి గురజాడ అప్పారావు రచించిన ఈ నాటకాన్ని ఈ నాటికీ తిలకిస్తూ తెలుగు కళాభిమానులు తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. వందేళ్ల తరువాత రాష్ట్రంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను ముందే ఊహించి, తన రచనలో పొందుపర్చి, కవికి ఉండాల్సిన ముఖ్య లక్షణాన్ని ముందు తరాలకు అందించిన మహాకవి రచనకు విజయవాడ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

kanyasulkam1
        ఆనాడు సమాజంలో పాతుకుపోయిన బాల్య వివాహాలు, మూఢ విశ్వాసాలు, వ్యక్తుల కుయుక్తులు, లంచావతారాలు... వంటి అంశాలపై వాడి వేడి వ్యంగ్యాన్ని రచించడంతో పాటు వితంతువులకు పునర్వివాహాలను సమర్ధిస్తూ సాగిన ఈ కన్యాశుల్కం నాటకంలోని ప్రతి పాత్రతో ఈ సమాజం కళ్లు తెరిపించే ప్రయత్నం చేశాడు మన గురజాడ. మహాకవి గురజాడ అప్పారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో నిరంతరాయంగా ఎనిమిది గంటల పాటు విజయనగరానికి చెందిన నవయుగ ఆర్ట్స్ కళాకారులు ప్రదర్శించిన ఈ నాటకం ఆద్యంతం ఆహూతులను అలరించింది.

gurajada_in
         ఈ నాటకంలో ప్రధానంగా మధువాణి పాత్ర కీలకమైంది. ఈ పాత్రలో కాకినాడకు చెందిన కళాకారిణి మణిబాల తన శక్తి వంచన లేకుండా నటించారు. మానవత్వానికి కుల, మతాలు ప్రా మాణికం కాదని, నిమ్న కులంలో పుట్టినా మానవత్వం ఉంటుందనే సందేశాన్ని ఈ పాత్ర ద్వారా గురజాడ వెల్లడించారు. మరో కీలక పాత్ర గిరీశంగా ఉదయభాస్కర్ పాత్రోచితంగా హావభావాలు ప్రదర్శించారు. రావప్ప పంతులుగా డాక్టర్ ఆర్.సత్యనారాయణ తన పాత్రకు న్యాయం చేశారు. అగ్నిహోత్రావధానులుగా నటించిన జి.వి.ఎన్.కృష్టమోహన్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. లబ్ధావధానులుగా జొన్నలగడ్డ సీతారామశాస్త్రి నటనకు ఆహూతుల నుంచి ప్రశంసలు లభించాయి. వెంకమ్మగా సురభి విద్యావతి, బుచ్చమ్మగా వెంక ట పద్మావతి, కరకటక శాస్త్రిగా తేలిచర్ల అనిల్, వెంకటేశంగా కృష్ణచైతన్యల నటనకు విచ్చేసిన వారంతా అభినందనలు తెలిపారు. మహేశంగా ఆదిత్య మాస్టార్, పూటకూళ్ళమ్మగా బత్తుల లక్ష్మి నటన అందరిచే శభాష్ అనిపించుకుంది.        ఎప్పుడో 1892లో ఈ నాటకాన్ని గురజాడ అప్పారావు రచించగా అదే ఏడాది ఆగస్టు 13న విజయనగరంలో పూర్తి నిడివిలో ఈ నాటకాన్ని ప్రదర్శించారు. 1897లో ఈ నాటకానికి అక్షర రూపాన్నిచ్చారు. 1909లో గురజాడే రెండోసారి ఈ నాటకంలో కొన్ని మార్పులు చేశారు. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నది ఈ నవీన ముద్రణే. తొలి నాళ్లలో పూర్తి నిడివిగా ప్రదర్శితమైన ఈ నాటకాన్ని తిరిగి 2011లో విశాఖపట్నంలో ప్రదర్శించారు. అది చూసిన నగరానికి చెందిన కొందరు ప్రముఖులు విజయవాడలో కూడా ఏర్పాటు చేయాలని భావించి ఈ ప్రదర్శన ఏర్పాటు చేసి విజయవంతమయ్యారు. ఇలా ఎనిమిది గంటల పాటు ఈ నాటకాన్ని ప్రదర్శించడం గురజాడకు అర్పించే నిజమైన నివాళి అని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  National institute of technology notification
K viswanadh helping hand to new directors  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more