స్ధల పురాణం

May 17,2013 10:26 AM
స్ధల పురాణం

స్థలపురాణం:;- స్కాంద,బ్రహ్మాండ పురాణాలలో శ్రీ యాదగిరి క్షేత్ర మహాత్మ్యం వర్ణించ బడినట్లు స్థల పురాణం చెపుతోంది. విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుని కుమారుడు యాద ఋషి. ఈమహర్షి నరసింహోపాసకుడు. శ్రీలక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యక్షంగా దర్శించాలని ఈ మహర్షి కోరిక. అందుకొరకు ముందుగా భక్త పరాథీనుడైన శ్రీ ఆంజనేయుని ప్రార్థించాడు. ఆంజనేయుడు యాద ఋషి కి కలలో కన్పించి, సమీపం లోని కొండగుహ లో స్వామిని గూర్చి తపస్సుచేయమని,శ్రీ స్వామి సాక్షాత్కారం లభించగలదని చెప్పాడు.

శ్రీలక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనాభిలాషగల మహర్షి ఘోరతపస్సు తో శ్రీస్వామి వారిని ప్రసన్నుని చేసుకున్నాడు. యాద ఋషి కోరిక మేరకు శ్రీ స్వామి యోగానంద, జ్వాల, లక్ష్మీనరసింహ రూపాలతో గుహలో కొలువుతీరాడు. ఆమహర్షి పేరుతో ఆ పర్వతము యాదగిరి గా ప్రసిద్ధమైంది. మూడువందల అడుగుల ఎత్తు మాత్రమే గల కొండ కాబట్టి ప్రజల వాడుకలో గుట్ట గా పిలవబడుతూ,యాదగిరిగుట్ట గా ప్రసిద్ధి పొందింది.

మెట్లమార్గం ప్రవేశద్వారం

ఆంజనేయుని అనుగ్రహం వల్లనే యాదమహర్షి కి శ్రీ స్వామి దర్శనం లభించింది కాబట్టి మహర్షి కోరిక మేరకు శ్రీ ఆంజనేయుడే ఇచ్చట క్షేత్రపాలకుడు గా నిలిచి పూజలందుకుంటున్నాడు శ్రీస్వామి వారి గుహాలయానికి వెలుపలనున్న ముఖమండపం లో ఆండాళమ్మ సన్నిథికి ఎడమవైపు అంజనీపుత్రుడు వేంచేసియున్నాడు.

పుష్కరిణి

పుష్కరిణి చెంత శ్రీఆంజనేయునకు ప్రత్యేకం గా ఆలయం నిర్మించ బడింది. పుష్కరిణి లో పవిత్రస్నానం చేసిన భక్తులు ముందుగా ఈ క్షేత్రపాలకుని దర్శించుకొని, ఆయన అనుమతి తోనే శ్రీలక్ష్మీనరసింహుని దర్శనానికి బయలుదేరుతారు.

పుష్కరిణి సమీపమందలి శ్రీ ఆంజనేయ ఆలయం

శ్రీస్వామి దర్శనం.:-- ఇచ్చట శ్రీ స్వామివారు గుహలో ఒక వేదికపై కొలువు తీరి ఉంటారు. గర్భాలయం, అంత్రాలయం అనేవి వేరుగా లేవు. భక్తులు నేరుగా ముఖమండపం నుండి స్వామి సన్నిథికి నడిపించబడతారు. లోపలికి ప్రవేశించగానే ఎదురుగా ఉన్న శిలకు యోగపట్టసమాసీనుడైన యోగనరసింహుని స్వయంభువు రూపం మనకు దర్శనమిస్తుంది.

యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య మంగళ రూపం

ఆయనకు కొంచెం ఎడమవైపున జ్వాలా నరసింహుని స్వయంభువ రూపం దక్షిణవైపు శిలకు స్పష్టాస్పష్టంగా కన్పిస్తుంది. ఇది గుహ లోపలికి ఉండటం వలన సామాన్య భక్తులు దర్శించుకొనే అవకాశం తక్కువ. మనకు దర్శనమిచ్చే రూపం శ్రీలక్ష్మీ నరసింహస్వామి. ఆనాడు యాదమహర్షి కి ప్రత్యక్షమైన రీతిలోనే శ్రీస్వామి శ్రీలక్ష్మీ అమ్మవారితో కలసి, నిలిచి, భక్తులను అనుగ్రహిస్తున్న అర్చామూర్తిగానే మనకు దర్శనమిస్తారు.

ఆలయ విమాన దృశ్యం

చారిత్రకత.::-- భువనగిరి లోని ఏకశిలాపర్వతము పై కోటను నిర్మించిన త్రిభువన మల్లుడు (క్రీ.. 1148) యాదగిరి శ్రీలక్ష్మీనరసింహుని సేవించినట్లు కొలనుపాక వీర నారాయణస్వామి ఆలయమందలి శాసనము వలన తెలియుచున్నది.

భువనగిరి కోట నిర్మించబడిన ఏకశిలా పర్వతము

ఆలయప్రత్యేకత ::-- శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ని నమ్మి సేవిస్తే ఎటువంటి శారీరక రుగ్మతలైనా తొలగిపోతాయనే విశ్వాసం భక్తుల్లో అపారం గా ఉంది. అందుకనే ఈయననువైద్య నారసింహుడని భక్తులు భక్తి తో పిలుచుకుంటారు. ఒక మండలంరోజులు స్వామి చెంతనే ఉండి, పుష్కరిణి లో స్నానం చేసి, ప్రదక్షిణాలు చేస్తూ సేవించుకుంటే సమస్త బాధలు నశిస్తాయని విశ్వాసం. కొన్ని నివారణ లేని వ్యాథులను సైతం శ్రీ స్వామి రాత్రివేళ కలలోకి వైద్యుని రూపం లో వచ్చి ఆపరేషన్ చేసి నయం చేశాడని, ఆ అనుభూతి పొందిన భక్తులు చెపుతుంటారు. ఇది ఈ స్వామి ప్రత్యేకత గా ప్రచారం పొందింది. నమ్మకాన్ని మించిన మందులేదు కదా ! గ్రహబాథలను పారద్రోలుతాడని నరసింహుని యెడల భక్తులకు అపార విశ్వాసం.

జాతీయ రహదారి ప్రక్కన కన్పించే తోరణ ద్వారము

శ్రీ స్వామి వారి సన్నిథి లో సత్యనారాయణవ్రతం చేసుకోవడం శుభమని భక్తులు భావిస్తారు. అందుకోసం ప్రత్యేకంగా వ్రతమండపం కూడ నిర్మించబడింది.

 నిర్వహిస్తారు .ప్రతి నెలలోను శ్రీస్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శతఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు.

శ్రీ స్వామి వారి కళ్యాణ మండపం

గోశాలతులసి వనం ,నిత్యాన్నదానపథకంఉచిత ప్రసాద వినియోగం ,మొదలైన పథకాలను ఆలయ యాజమాన్య ఆధ్వర్యం లో సమర్థవంతం గా నిర్వహిస్తున్నారుఒక సంస్కృత విద్యాపీఠాన్నిఒక అల్లోపతిఒక ఆయుర్వేద వైద్యశాలల్ని కూడ ఆలయ ఆధ్వర్యం లో నిర్వహించడం మిక్కిలి ప్రశంసించ దగ్గ విషయం .

ప్రత్యేక ఉత్సవాలు :;--- ప్రతి సంవత్సరము ఫాల్గుణ శుద్ధ విదియ నుండి ద్వాదశి వరకు వార్షిక బ్రహ్మోత్స వాలుశ్రావణ శుద్ధ దశమి నుండి ఏకాదశి వరకు పవిత్రోత్సవాలు జరుగుతాయినరసింహ జయంతిఆండాళ్ తిరునక్షత్రంరామానుజ తిరునక్షత్రం,ముక్కోటి ఏకాదశి ,ధనుర్మాసంశ్రీరామనవమి నవరాత్రులుశ్రీకృష్ణాష్టమిమొదలైనవి ప్రత్యేక ఉత్సవాలు .

కళ్యాణ నరసింహుని దివ్య దర్శనం

చైత్రశుద్ధ పౌర్ణమి రోజున తెప్పోత్సవము ,వైశాఖబహుళ దశమి హనుమజ్జయంతిని,

Other Articles

  • Darshna samayalu

    May 17 | దర్శన సమయం ఆలయం ప్రారంభ ఉదయం 4.00 నుండి సాయంత్రం 9.30 వరకు ఉంటుంది. ప్రత్యేకంగా ఆదివారం / శనివారం / పండుగ రోజుల్లో ఉదయం 3 గంటల నుండి సాయంత్రం 9.30 వరకు... Read more

  • Bus station

    May 17 | హైదరాబాద్ మహత్మగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్, ఉప్పల్ నుండి అధికంగా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. అంతేకాకుండా భువనగిరి, నల్గొండ బస్ స్టేషన్ల నుండి అధిక సంఖ్యలో యాదగిరి గుట్టకు చేరుకుంటాయి. వివిధ... Read more

  • Railway station

    May 17 | రైలు మార్గం ద్వారా - యాదిగిరి గుట్టకు రైలుమార్గం ద్వారా చేరుకోవాలనేవారు దగ్గరలోని రైల్వే స్టేషన్లు భువనగిరి, నల్గొండ, కలవు, అక్కడి నుండి బస్సు ప్రయాణం లేదా కారు ప్రయాణంలో గుట్టకు చేరుకోవాలి..... Read more

  • Air port

    May 17 | విమాన ప్రయాణం ద్వారా యాదిగిరి గుట్ట చేరుకోవాలంటే.. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగి, బస్సు ప్రయాణం చెయ్యాలి, లేదా అద్దె కారు ప్రయాణం ద్వారా ఒక గంటలో యాదిగిరి గుట్టకు చేరుకోవచ్చు. ... Read more

Additional Info

  • Sub Title: Yadagiri Gutta
Last modified on Friday, 17 May 2013 10:26