భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ విడుదల చేసే ర్యాకింగ్ లో దిగజారింది. ప్రపంచ నంబర్ 1 ర్యాంకును కోల్పోయి.. రెండు స్థానాలను దిగజారింది. గత కొన్ని రోజులుగా ప్రపంచ నంబర్ 1 ర్యాంకులో కొనసాగుతోన్న హైదరాబాదీ షట్లర్ తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో రెండు స్థానాలు కోల్పోయి మూడో ర్యాంకుకు పడిపోయింది. బ్యాట్మిండన్ ఒలంపిక్ ఛాంపియన్ లీ జురుయ్ 85,217 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, కరోలినా మారిన్ 80,752 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. గతంలో కూడా సైనా తొలి ర్యాంకును కైవసం చేసుకోగా కేవలం వారం రోజులు మాత్రమే అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగలిగింది. సైనా ఖాతాలో ప్రస్తుతం 79,192 పాయింట్లున్నాయి. బ్యాడ్మింటన్ ర్యాంకుల్లో ప్రపంచ తొలి ర్యాంకును కైవసం చేసుకున్న ఘనత సైనా నెహ్వాల్ సొంతం.
పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్ మూడో ర్యాంకును కైవసం చేసుకున్నాడు. అతని ఖాతాలో 67,157 పాయింట్లున్నాయి. కాగా చెన్ లాంగ్(చైనా), జాన్ ఓ జొర్గెన్ సన్ (డెన్మార్కు) వరుసగా తొలి, రెండో ర్యాంకుల్లో ఉన్నారు. పారుపల్లి కశ్యప్ (భారత్) 12వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. మహిళల డబుల్స్ లో గుత్తా జ్వాల - అశ్విని పొన్నప్ప జంట 17వ ర్యాంకును కైవసం చేసుకుంది. పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ ప్రస్తుతం జరుగుతోన్న ఇండోనేషియా సూపర్ సీరిస్ క్వార్టర్ ఫైనల్స్ కి చేరారు. ఈ టోర్నమెంటు ఫైనల్ కు చేరితే.. వారి ర్యాంకులు మెరుగయ్యే అవకాశఆలున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more