తెలంగాణ రాష్ట్ర చెస్ క్రీడాకారిణి అయిన హిందూజ రెడ్డి.. జాతీయ మహిళ ఛాలెంజర్స్ ‘బి’ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకాన్ని సాధించింది. గోవాలో సోమవారం ముగిసిన ఈ టోర్నీలో.. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత హిందూజ 8.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం స్వాధీనం చేసుకుంది. విజయకెరటానికి దరిదాపులదాకా వెళ్లి వచ్చిన ఈ తెలుగమ్మాయి... టైటిల్ కోసం చాలానే కష్టపడింది. అయితే చివరి నిముషంలో కేవలం కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే.. అంతవరకు గెలిచి రావడం కూడా అంత సామాన్య విషయం కాదని పేర్కొంటున్నారు నిపుణులు!
హిందూజ మొత్తం ఎనిమిది గేముల్లో గెలిచి, ఒక గేమ్ ను డ్రాగా ముగించగా... మరో రెండింటిలో మాత్రం ఓడిపోయింది. చివరి రౌండ్ ల తెల్లపావులతో ఆడిన హిందూజ... 64 ఎత్తులో ఏజీ నిమ్మీపై విజయం సాధించింది. ఈ టోర్నీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ ప్రతిభను కనబరిచి అందరినీ బాగానే ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన బొడ్డ ప్రత్యూష 8 పాయింట్లతో ఏడో స్థానంలో, లక్ష్మీప్రణీత 7.5 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో, జి.లాస్య 7.5 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచారు. తొమ్మిది మంది క్రీడాకారిణులు 7.5 పాయింట్లు సాధించగా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా తుది ర్యాంక్లను ఖరారు చేశారు.
ఈ టోర్నీలో నిషా మొహతా (పీఎస్పీబీ), విజయలక్ష్మి (ఎయిరిండియా) 9.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా నిషా మొహతాకు టైటిల్ లభించింది. విజయలక్ష్మీ రన్నరప్గా నిలిచింది. ఏదిఏమైనా.. గేమ్ చివరిదాకా పోరాటం సాగించి, కాంస్యం సాధించినందుకు హిందూజారెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more