ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి కాస్త ఆలస్యంగా చేరిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు ముఖ్యకారణం ఆయన వివాహం జరగడమే. ఎవరితో అంటే భారత్ కు చెందిన ఆయన గర్ల్ ఫ్రెండ్ విని రామన్ తో ఇటీవలే ఆయన వివాహమాడారు. గత నెల 27వ తేదీన విరిద్దరి కళ్యాణం జరిగడంతో కాసింత ఆలస్యంగా ఆయన ఐపీఎల్ లోని తన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరారు. ఇంతవరకు బాగానే వున్నా.. ఆయన మాత్రం ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ లో మాత్రం ఆయన ఆడటం లేదు.
ముంబైలోని వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్కు మాక్స్వెల్ దూరంగా ఉండనున్నాడు. వచ్చిందే ఆలస్యంగా అంటే ఇక మ్యాచ్ లు ఆడకుండా దూరంగా ఉంటానని చెప్పడం ఏంటీ.. అన్న ప్రశ్నలు వస్తున్నాయా.? అయితే ఇక్కడ ఓ చిన్న కిటుకు ఉంది. స్వతహాగా అస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్ వెల్.. ఐపీఎల్ ఆడాలంటే అందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి తప్పనిసరి. అయితే ఈ సారి క్రికెట్ ఆస్ట్రేలియా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. బోర్డు నుంచి కాంట్రాక్ట్ పొందిన ఏ ఆసీస్ ఆటగాడు ఏప్రిల్ 6 లోపు ఐపీఎల్లో పాల్గొనకూడదు.
ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్కు గ్లెన్ మాక్స్వెల్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెస్సన్ ధృవీకరించాడు. “క్రికెట్ ఆస్ట్రేలియా గైడ్లైన్స్ ప్రకారం.. ఏప్రిల్ 6వ తేదీ లోపు కాంట్రాక్టు పొందిన ఆసీస్ ఆటగాళ్లు ఎవరూ అందుబాటులో ఉండరు. కాబట్టి గ్లెన్ మాక్స్వెల్ జట్టుతో చేరినప్పటికి అతడు బెంచ్కే పరిమితం కానున్నాడు. అతడు ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్కు అందుబాటులో ఉండనున్నాడు" అని మైక్ హెస్సన్ పేర్కొన్నాడు. తన వివాహం కారణంగా మాక్స్వెల్ ఐపీఎల్-2022 ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యాడు.
Our Tom and Jerry forever!@Gmaxi_32 @yuzi_chahal #PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/sHDkjMWj4g
— Royal Challengers Bangalore (@RCBTweets) April 4, 2022
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more