కోహ్లీ సేనకు మరోమారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జరిమానా విధించింది. తొలి వన్డేలో ఎదురైన పరాభవం మరోమారు మూడవ.. చివరి టీ20లోనూ టీమిండియా చవిచూడాల్సివచ్చింది. ఈ జరిమానా విధింపుకు ఆసీస్ తో జరిగిన చివరి టీ20లో స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియాకు ఐసీసీ జరిమానా విధించింది. ఇన్నింగ్స్ నిర్ణీత సమయంలో ఒక ఓవర్ ఆలస్యంగా పూర్తిచేయడంతో భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లు రాడ్ టకర్, అబూడ్, టీవీ అంపైర్ పాల్ రీఫెల్, ఫోర్త్ అంపైర్ సామ్ ఫిర్యాదు మేరకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
‘‘ఐసీసీ ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్దేశించిన సమయంలో బౌలింగ్ పూర్తి చేయనందుకు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ పొరపాటుని అంగీకరించడంతో దీనిపై విచారణ అవసరం లేదు’’ అని ఐసీసీ ప్రకటనలో తెలిపింది. సిడ్నీ వేదికగా మంగళవారం ఆసీస్తో జరిగిన ఆఖరి టీ20లో భారత్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలసిందే. దీంతో మూడు టీ20ల సిరీస్ను టీమిండియా 2-1తో ముగించింది. ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భాగంగా డిసెంబర్ 17 నుంచి కోహ్లీసేన నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆడిలైడ్ వేదికగా తొలి డే/నైట్ టెస్టు జరగనుంది.
(And get your daily news straight to your inbox)
Dec 16 | బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఓ వివాదంపై స్పందించాడు. ఓ టీ20 మ్యాచ్ లో సహచర ఆటగాడి పట్ల తాను ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. మ్యాచ్ జరుగుతుండగా, ఓ క్యాచ్... Read more
Dec 10 | టీమిండియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టు షాక్ తగిలింది. అసీస్ జట్టులో కీలకమైన ఓపెనర్ డేవిడ్ వార్నర్ జట్టుకు దూరం కానున్నాడు. తొడకండరాల గాయంతో టీమిండియాతో చివరి వన్డే, టీ20 సిరీస్... Read more
Dec 09 | టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికుతున్నట్లు ఇవాళ ప్రకటించాడు. పరిమిత ఓవర్లతో పాటు టెస్టు క్రికెట్ సహా అన్ని ఫార్మాట్లకు ఆయనగుడ్ బై... Read more
Dec 09 | కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ గత పక్షం రోజులుగా ఢిల్లీలోని సింఘు సరిహద్దులో రైతులు అందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా అప్రతిహాత విజయాలను నమోదు చేసుకున్న బాక్సర్ విజేందర్ సింగ్... Read more
Nov 28 | తన జట్టును ఓటమి నుంచి కాపాడేందుకు ఓ బ్యాట్స్ మెన్ ఎం చేయగలడో అదే టీమిండియా అల్ రౌండర్ హార్థిక్ పాండ్య చేశాడని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కొనియాడాడు. భారత జట్టుకు... Read more