భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా కొనసాగుతున్న సౌరవ్ గంగూలీ తాజాగా చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేశాయి. ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు సమర్థించగా, మరికోందరు వ్యతిరేకించారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. గంగూలీ తనకు బిసిసిఐ బోర్డులోని పలువురితో పాటు కోచ్ సహా అందరూ కలసి అన్యాయం చేశారని అన్నారు. దీంతో బీసిసిఐ హోదాలో వున్న ఆయనను బోర్డు సభ్యులు అన్యాయం చేయడమేంటా.? అని అలోచిస్తున్నారా.? అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదు. ఆయన క్రికెట్ అడుతున్న సందర్భంలో జరిగిన ఘటనను గుర్చి వివరిస్తూ ఆలా చెప్పారు.
తాను క్రికెట్ ఆడే సమయంలో అందులో ఉండే వ్యక్తులు తనకు అన్యాయం చేసారు అని సంచలన వ్యాఖ్యలు చేసాడు గంగూలీ. తనను భారత జట్టుకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి అకస్మాత్తుగా తప్పించిన ఘటనలపై ఆయన తాజాగా స్పందించారు. 2003 వన్డే ప్రపంచకప్ లో భారత జట్టు గంగూలీ కెప్టెన్సీలో ఫైనల్ కు వచ్చి ఓడిపోయింది. అందువల్ల 2007లో జరిగే ప్రపంచకప్ని గెలవాలని అనుకున్నట్లు దాదా తెలిపాడు. కానీ ఊహించని విధంగా నన్ను వన్డే కెప్టెన్సీ నుండి తొలగించారు అని ఆ తర్వాత టెస్టు జట్టులోకి కూడా రానివ్వలేదని గంగూలీ అన్నాడు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. జింబాబ్వే పర్యటనలో విజయం సాధించి వచ్చిన తర్వాత నన్ను వన్డే కెప్టెన్సీ నుండి తొలగించారు. ఆ తర్వాత టెస్ట్ జట్టులోకి కూడా ఎంపిక చేయలేదు. అప్పటి భారత జట్టు కోచ్ గ్రేగ్ ఛాపెల్ కారణంగానే ఇలా జరిగింది. కానీ బీసీసీఐ లోని కొందరు అతనికి మద్దతు పలికి నాకు అన్యాయం చేసారని తెలిపాడు. కానీ ఏడాది గ్యాప్ తర్వాత మళ్ళీ తన ఆటతో టెస్ట్ జట్టులోకి వచ్చాడు దాదా. అయితే అప్పుడు తనకు ఎక్కడ అన్యాయం జరిగిందో ఇప్పుడు అక్కడే అత్యున్నత స్థాయిలో ఉన్నాడు గంగూలీ.
(And get your daily news straight to your inbox)
Dec 16 | బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఓ వివాదంపై స్పందించాడు. ఓ టీ20 మ్యాచ్ లో సహచర ఆటగాడి పట్ల తాను ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. మ్యాచ్ జరుగుతుండగా, ఓ క్యాచ్... Read more
Dec 10 | కోహ్లీ సేనకు మరోమారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జరిమానా విధించింది. తొలి వన్డేలో ఎదురైన పరాభవం మరోమారు మూడవ.. చివరి టీ20లోనూ టీమిండియా చవిచూడాల్సివచ్చింది. ఈ జరిమానా విధింపుకు ఆసీస్ తో జరిగిన చివరి... Read more
Dec 10 | టీమిండియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టు షాక్ తగిలింది. అసీస్ జట్టులో కీలకమైన ఓపెనర్ డేవిడ్ వార్నర్ జట్టుకు దూరం కానున్నాడు. తొడకండరాల గాయంతో టీమిండియాతో చివరి వన్డే, టీ20 సిరీస్... Read more
Dec 09 | టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికుతున్నట్లు ఇవాళ ప్రకటించాడు. పరిమిత ఓవర్లతో పాటు టెస్టు క్రికెట్ సహా అన్ని ఫార్మాట్లకు ఆయనగుడ్ బై... Read more
Dec 09 | కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ గత పక్షం రోజులుగా ఢిల్లీలోని సింఘు సరిహద్దులో రైతులు అందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా అప్రతిహాత విజయాలను నమోదు చేసుకున్న బాక్సర్ విజేందర్ సింగ్... Read more