టీమిండియా చీఫ్ సెలక్టర్ గా మాజీ క్రికెటర్ సునీల్ జోషి నియమితులయ్యాడు. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నుంచి జెషి త్వరలో బాధ్యతలను అందుకోనున్నారు. ఇటీవల ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్ ఖోడాల పదవీకాలం ముగిసింది. అయితే వీరి స్థానాల్లో కొత్త సెలక్టర్లను ఎంపిక చేసే బాధ్యత బిసిసిఐ త్రిసభ్య క్రికెట్ అడ్వైజరీ కమిటీపై పడింది. దీంతో మదన్ లాల్, ఆర్సీ సింగ్, సులక్షణ నాయక్ లతో కూడిన ముగ్గురు సభ్యుల క్రికెట్ అడ్వైజరీ కమిటీ నూతన ఎంపికలను సిఫార్సు చేసింది.
ఈ క్రమంలో ముందుగా చీఫ్ సెలక్టర్, సెలక్టర్ స్థానాల భర్తీ కోసం బీసీసీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో.. భారత మాజీ క్రికెటర్లతో సహా మొత్తం 44 మంది దరఖాస్తు చేసుకున్నారు. చీఫ్ సెలక్టర్, సెలక్టర్ పదవి కోసం వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ).. వడపోత అనంతరం ఓ ఐదుగుర్ని మాత్రమే ఇంటర్వ్యూలకి పిలిచింది. ఇందులో సునీల్ జోషి, వెంకటేశ్ ప్రసాద్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, రాజేశ్ చౌహాన్, హర్విందర్ సింగ్ ఉన్నారు. ఇవాళ ఇంటర్వ్యూలు నిర్వహించిన క్రికెట్ సలహా కమిటీ.. చీఫ్ సెలక్టర్గా సునీల్ జోషి, సెలక్టర్గా హర్విందర్ సింగ్ పేర్లని బీసీసీకి ప్రతిపాదించింది.
దక్షిణాఫ్రికాతో మార్చి 12 నుంచి భారత్ జట్టు మూడు వన్డేల సిరీస్ ఆడనుండగా.. కొత్తగా ఎంపికైనా సెలక్షన్ కమిటీ ఈ సిరీస్కి టీమ్ని ఎంపిక చేయనుంది. వాస్తవానికి చీఫ్ సెలక్టర్గా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగర్కార్ ఎంపికవుతాడనే వార్తలు వచ్చాయి. కానీ.. అనూహ్యంగా అతను కనీసం తుది జాబితాలో కూడా చోటు దక్కించుకోలేపోయాడు. ఇటీవల న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడిన భారత్ జట్టు 0-3 తేడాతో వైట్వాష్కి గురైంది. ఈ నేపథ్యంలో కొత్త సెలక్టర్లు సాహసోపేత నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more