అతిధ్యజట్టు న్యూజీలాండ్ తో రసవత్తరంగా సాగిన మూడో టీ20లో టీమిండియా హ్యాట్రిక్ విజయంతో సీరిస్ ను చేజిక్కించుకుంది. చివరి బంతి వరకు ఉత్కంఠకరంగా సాగిన పోరులో విరాట్ సేన ఏమాత్రం తగ్గకుండా పోరాడింది. ఫలితంగా మూడవ టీ20లో రెండు జట్లు సమాన స్కోరునే చేయడంతో ఫలితం తేల్చేందుకు రెండు జట్ట మధ్య సూపర్ ఓవర్ కీలకంగా మారింది. అయితే సూపర్ ఓవర్ లోనూ కడవరకు ఉత్కంఠకు తెరలేపగా.. చివరి బంతిని సిక్స్ గా మలిచి భారత్ కు బ్లాక్ క్యాప్స్ పై మూడవ విజయాన్ని అందించడంతో పాటు సిరీస్ ను కూడా కైవసం చేసుకునేలా చేశాడు డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ.
హమిల్టన్ వేదికగా సెడాన్ పార్కులో జరిగిన మూడవ టీ20లో టాస్ ఓడిన విరాట్ సేనను తొలుత బ్యాటింగ్ కు దించింది అతిధ్య జట్టు. మొదటి రెండు టీ20లలో విఫలమైన రోహిత్ శర్మ ఈ టీ20లో వీరవిహారం చేశాడు. కేవలం 40 బంతుల్లో 65 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ కూడా 19 బంతుల్లో 27 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 82 పరుగులు జోడించారు. వీరి ధాటికి 8 ఓవర్లకే స్కోరు 80 దాటింది. స్కోరుబోర్డును పరుగులెత్తిస్తున్న ఈ భాగస్వామ్యాన్ని తొమ్మిదో ఓవర్ వేసిన గ్రాండ్ హోమ్ ఆఖరి బంతితో విడదీశాడు.
ఆ వెంటనే రోహిత్, శివమ్ దూబె (3) ఔటవ్వడంతో స్కోరు వేగం తగ్గింది. ఈ క్రమంలో 27 బంతుల్లో 38 పరుగులతో కెప్టెన్ విరాట్ కోహ్లీ తన బ్యాటును జుళిపించాడు. ఆ తరువాత శ్రేయస్ అయ్యర్ (17) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే చివరి ఓవర్లకు చేరకునే సరికి కివీస్ బౌలర్లు అద్భుతంగా పుంజుకొని భారత్ భ్యాట్స్ మెన్లను క్రీజులో నిలదొక్కుకోనీయకుండా ఔట్ చేసి రన్రేట్ తగ్గించారు. చివర్లో మనీశ్ పాండే ఆరు బంతుల్లో 14పరుగులతో, రవీంద్ర జడేజా ఐదు బంతుల్లో పది పరుగులతో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లకు భారత్ 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
కాగా, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్స్ ఒంటిచేత్తో మ్యాచ్ ను విజయతీరాల వరకు చేర్చాడు. కేవలం 48 బంతుల్లో 95 పరుగులు సాధించాడు. బుమ్రా వేసిన 19 ఓవర్లో 11 పరుగులు రావడంతో కివీస్ 171/4తో నిలిచింది. సమీకరణం 6 బంతుల్లో 9గా మారింది. ఆఖరి ఓవర్ను షమి వేశాడు. తొలి బంతికి కేన్ సిక్సర్గా మలచడంతో ఇక విజయం లాంఛనమే అనుకున్నారు. అయితే అఖరి ఓవర్ వేసిన షమీ తనదైన రీతిలో విరుచుకుపడటంతో న్యూజీలాండ్ స్కోరు కూడా 179/6 కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది.
సూపర్ ఓవర్ ఫలితం ఇలా..
కివీస్ తరఫున విలియమ్సన్, గప్టిల్ బరిలో దిగి 6 బంతుల్లో 17 పరుగులు చేశారు. బుమ్రా పదునైన బంతులు విసిరినా ఓ సిక్సర్, బౌండరీలతో 17 పరుగులను సాధించిన కివీస్ భారత్ ఎదుట 18 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. భారత్ తరపున బరిలో దిగిన రోహిత్, రాహుల్ జోడీకి కివీస్ పేసర్ సౌథీ పదునైన యార్కర్లు రుచి చూపించాడు. తొలి బంతికి రోహిత్ 2 పరుగులు, ఆ తరువాత బంతికి ఒకటి, మూడో బంతిని బౌండరీ.. నాలుగో బంతికి ఒక్క పరుగుతో స్కోరు 8కి చేరింది. దీంతో చివరి రెండు బంతులకు ఒక బౌండరీ, ఒక సిక్స్ అవసరం ఏర్పడింది. క్రీజులో వున్న రోహిత్ వరుసగా 5, 6వ బంతులను స్టాండ్స్ లోకి పంపడంతో భారత్ గెలుపుతీరాలకు చేరింది. ఈ మ్యాచ్ విజయంతో 5 టి20ల సిరీస్ ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య నాలుగో టి20 జనవరి 31న వెల్లింగ్టన్ లో జరగనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more