భారత పర్యటనకు వస్తున్న బంగ్లాదేశ్ తో నవంబరు 3 నుంచి సిరీస్ జరుగనున్న క్రమంలో టీమిండియా జట్టుకి ఉగ్ర ముప్పు పొంచి ఉందన్న వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ విషయాన్ని నిజమేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వెల్లడించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ (ఫిరోజ్ షా కోట్ల) స్టేడియంలో ఈ ఆదివారం బంగ్లాదేశ్ తో టీమిండియా తొలి టీ20లో తలపడనుండగా.. ఆరోజు భారత క్రికెటర్లపై దాడి చేయబోతున్నట్లు ఓ బెదిరింపు లేఖ ఎన్ఐఏ చేతికి వచ్చింది. దీంతో.. ఆ లేఖని బీసీసీఐ సెక్యూరిటీ ఏజెన్సీకి ఎన్ఐఏ పంపింది.
ఈ లేఖపై అప్రమత్తంగా వ్యవహరించాలని అటు ఢిల్లీ పోలీసులకు సూచనలు జారీ చేసిన ఎన్ఐఏ.. టీమ్ భద్రతని ఒకసారి సమీక్షించుకోవాలని కూడా బిసిసిఐ సెక్యూరిటీ ఏజెన్సీకి కూడా తెలిపింది. వాస్తవానికి భారత్ జట్టు ఇటీవల వెస్టిండీస్ పర్యటనకి వెళ్లిన సమయంలోనూ ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. దీంతో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీమ్ భద్రతని అప్పట్లో పెంచారు. తాజాగా మరోసారి అలాంటి హెచ్చరికే వచ్చింది. అయితే.. ఈ సారి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మ్యాచ్ ను చూసేందుకు వచ్చే రాజకీయ ప్రముఖులు తమ మెయిన్ టార్గెట్ అని ఆ లేఖలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరీ ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ హిట్ లిస్టు జాబితాలో వున్నట్లు కేరళాలోని కోజికోఢ్ కు చెందిన అల్ ఇండియా లష్కరేకు చెందిన ఉగ్రవాద సంస్థ లేఖలో పేర్కోన్నట్లు సమాచారం. కాగా, భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే సిరీస్ ని వీక్షించేందుకు భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన భారత సెలక్టర్లు.. రోహిత్ శర్మ చేతికి పగ్గాలు అప్పగించారు. దీంతో.. ప్రస్తుతం టీమ్కి దూరంగా ఉంటున్న కోహ్లీ భద్రతపైనా అధికారులు దృష్టి సారించారు. అలానే భారత్ జట్టు సీనియర్ ఆటగాళ్ల భద్రతనీ సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more