వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే వన్డే, టీ-20 సిరీస్ లను కైవసం చేసుకున్న టీమిండియా, ఇప్పుడు టెస్టు సిరీస్ పై కూడా పట్టుబిగించేందుకు సమాయత్తం అయ్యింది. అంటిగ్వాలో జరిగుతున్న టెస్టు మ్యాచ్ లో విరాట్ సేన నాలుగు రోజుల్లోనే విండీస్ పై విజయాన్ని అందుకుని టెస్టు మ్యాచుల్లోనూ జయకేతనం ఎగురవేసింది. తొలి టెస్టులో టీమిండియా జట్టు సమిష్టిగా రాణించడంతోనే విజయం నల్లేరు మీద నడకలా సాగింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ తో పాటు గ్రౌండ్ లోనూ భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు.
తొలి ఇన్నింగ్స్ లో టాప్ ఆర్డర్ విఫలం కావడంతోనే టెస్టులో విండీస్ పైచేయి సాధిస్తుందని అందరూ భావించారు. కానీ ఆ తరువాత రంగంలోకి దిగిన బ్యాట్స్ మెన్లు నెమ్మదిగా అడి స్కోరుబోర్డుకు గౌరవప్రదమైన స్కోరు చేరేలా శ్రమించారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో రహానే సెంచరీకి తోడు మిగతా ప్లేయర్లు కూడా రాణించడంతో, 343/7 వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ వత్యాసాన్ని కూడా కలుపుకుని విండీస్ ఎదుట 419 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సొంతగడ్డపై బ్యాట్స్ మన్ కు స్వర్గధామంగా ఉన్న పిచ్ ని అంచనా వేయలేకపోయిన విండీస్ ఆటగాళ్లు కేవలం 100 పరుగులకు ఆలౌట్ అయ్యారు.
దీంతో భారత్ 318 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. వెస్టిండీస్ జట్టుపై భారత్ కు ఇదే అత్యుత్తమ విజయం కావడం గమనార్హం. భారత బౌలర్లలో బుమ్రా 7 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీయగా, ఇశాంత్ శర్మ 31 పరుగులిచ్చి 3, షమీ 13 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. వెస్టిండీస్ ఆటగాళ్లలో రోస్టన్ చేజ్ (12), కీమర్ రోచ్ (38), మిగెల్ కమిన్స్ (19) మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోవడం గమనార్హం. కాగా, విండీస్ తో రెండో టెస్టు ఈనెల 30 నుంచి కింగ్ స్టన్ లో జరుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more