భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి విశాఖపట్నంతో వున్న అనుబంధం అత్యంత ప్రత్యేకమైనది. క్రికెటర్ గా తన ప్రస్థానాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లిన విశాఖపై ధోనికి ఆకాశమంత ప్రేమ వుందని అనడం అతిశయోక్తి కాదు. ఆ మధ్య తన కెప్టెన్సీలో మ్యాచ్ అడిన తరువాత ఆయన విశాఖ ఎంతో అందమైన నగరమని కూడా కితాబిచ్చాడు. దీంతో విశాఖలో తన నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని వుందని తన మదిలోని మాటను చెప్పిన మిస్టర్ కూల్.. ఆవాసం కాకుండా అకాడమీకే ప్రాధాన్యత ఇచ్చాడు.
ఈ నేపథ్యంలో, విశాఖ సాగర తీరంలో రూ. 60 కోట్ల వ్యయంతో ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీని ఆయన నెలకొల్పబోతున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా సమక్షంలో ప్రభుత్వ అధికారులతో ధోనీకి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ మిహిర్ దివాకర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు దశల్లో అకాడమీతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఈ క్రికెట్ అకాడమీలో క్రికెట్ తో పాటు ఇతర క్రీడలకూ ఉపయోగకరంగా ఉండేలా 24 మైదానాలు (ఇండోర్, ఔట్ డోర్)లను నిర్మించనున్నారు. ఈ అకాడమీతో ఏపీ క్రీడా ముఖచిత్రంలో సమూల మార్పులు సంభవిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన పలు వివరాలను ఆర్కా స్పోర్ట్ త్వరలోనే వెల్లడించనుంది. అయితే ధోని క్రికెట్ అకాడమితో స్థానిక యువతతో పాటు ఆంధ్రప్రదేశ్, పరిసర రాష్ట్రాల చిన్నారులకు ఈ క్రికెట్ పట్ల అసక్తిని కూడా పెంచడంతో పాటు వారిని క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో దోహదపడుతుంది
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more