భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను అందుకునేందుకు అడుగుదూరంలో వున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో కేవలం నలుగురు క్రిడాకారులు మాత్రమే సాధించిన అరుదైన ఫీటును ఆయన సాధించేందుకు సిద్దమవుతున్నారు. ఈ చారిత్రక రికార్డుకి అందుకునేందుకు కోహ్లీ కేవలం అడుగు దూరంలో ఉన్నాడు. వెస్టిండీస్తో ఆదివారం నుంచి ప్రారంభంకానున్న ఐదు వన్డేల సిరీస్ లో కోహ్లి అ రికార్డును కూడా అందుకోనున్నాడు.
ఈ రికార్డును అందుకునేందుకు కోహ్లీ కేవలం 221 పరుగులు సాధించి తన ఖాతాలో వేసుకుంటే చాలు. రికార్డు తనంతట తాను కోహ్లీ వద్దకు నడుచుకుంటూ వచ్చేస్తుంది. 221 పరుగుల వద్ద ఏముంది అంటే.. వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఐదో భారత క్రికెటర్ గా రికార్డుల్లో నిలవనున్నాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు ఐదుగరు బ్యాట్స్ మెన్లు మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఈ ఫీటును విరాట్ సాధించడంతో వారి సరసన స్థానం లభించనుంది.
ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), మహేంద్రసింగ్ ధోని (10,123) మాత్రమే ఈ మార్క్ని అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రికార్డుని ఇప్పటి వరకు 12 మంది క్రికెటర్లు అందుకోగా అందులో నలుగురు భారత క్రికెటర్లే ఉండటం గర్వకారణం. శ్రీలంకతో ఆగస్టు 18, 2008లో జరిగిన వన్డే మ్యాచ్తో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లి.. అనతికాలంలోనే సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు.
ఈ దశాబ్దకాలంలో ఇప్పటి వరకు 211 వన్డేలు అడిన కోహ్లీ 58.21 సగటుతో 9,779 పరుగులు చేశాడు. ఇందులో 35 శతకాలు, 48 అర్ధశతకాలు ఉండటం విశేషం. వెస్టిండీస్ తో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్లో ఒక శతకం బాది సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లీ.. బలహీనమైన కరీబియన్ బౌలింగ్ని ఎదుర్కొని ఐదు వన్డేల్లో 221 పరుగులు చేయడం సులువే..!
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more