భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ కు బ్యాడ్మింటన్ రంగంలో ఎందరో అభిమానులు వున్నా ఆయన కూడా ఓ క్రికెటర్ కు వీరాభిమాని. ఆయన మరోవరో కాదండీ టీమిండియాకు వరల్డ్ కప్ తో పాటు టీ20 వరల్డ్ కప్ లను అందించిన బృందానికి సారధ్యం వహించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. అయితే ఈ ఇంటర్య్వూను చూఢాడో లేదో తెలియదు కానీ ఈ విషయాన్ని ఎలాగో తెలుసుకున్న మహేంద్ర సింగ్ ధోని తన అభిమాని అయిన స్టార్ షెటర్లను అశ్చర్యచకితుడ్ని చేశాడు.
అదేంటంటే కిదాంబికి ధోని ఒక ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చాడు. బెస్ట్ విషెస్ టు శ్రీకాంత్ అని రాసున్న తన బ్యాటును బహూకరించాడు. ఈ విషయాన్ని శ్రీకాంత్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 'అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ధోనీ. నీ బహుమతితో నేను ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను' అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ బహుమతిని అందించింది మాత్రం బీసిసిఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్. అయితే ఎంఎస్కేను క్రికెట్ రంగంలోకి వచ్చేలా స్పూర్తినిచ్చిన వ్యక్తి కిదాంబి శ్రీకాంత్ తండ్రి.
గుంటూరులో వీరి రెండు కుటుంబాలు ఇరుగుపోరుగునే వుండేవని, అయన కోరిక మేరకు తాను ఈ బహుమతిని అందిస్తున్నానని ఎంఎస్కే ప్రసాద్ కూడా పేర్కోన్నారు. ధోని అభిమానిని కాబట్టి తనకు ధోని నుంచి ఏదైనా కానుక ఇప్పించాలని శ్రీకాంత్ అడిగారట. ధోనీకి అభిమానుల్లో సామాన్యులే కాదు, సెలబ్రిటీలు సైతం ఉన్నారు. ధోనీని అమితంగా అభిమానించే వారిలో కిడాంబి శ్రీకాంత్ కూడా ఒకరు. ధోనీకి తాను పెద్ద అభిమానిని అంటూ అనేక సందర్భాల్లో శ్రీకాంత్ చెప్పాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more