తాను తీసిన 200 వికెట్లలో ప్రతి వికెటూ ప్రత్యేకమైనదే అని అంటున్నారు భారత మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఓ వికెట్ పడగొట్టడంతో జులన్ వన్డే క్రికెట్లో 200 వికెట్లు పడగొట్టిన తొలి మహిళా క్రికెటర్గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జులన్ మాట్లాడుతూ..‘ఇప్పటి వరకు నేను తీసిన ప్రతి వికెట్ నాకు గుర్తుంది.
నా తొలి వికెట్ 2002లో ఇంగ్లాండ్పై సాధించా. చెన్నైలో జరిగిన మ్యాచ్లో కారోలిన్ అట్కిన్స్ గాల్లోకి లేపిన బంతిని మిథాలీరాజ్ క్యాచ్ పట్టింది. ఇప్పటి వరకు నేను సాధించిన ప్రతి వికెట్టూ నాకెంతో ప్రత్యేకమైనది’ అని జులన్ తెలిపింది. ‘నేను 200 వికెట్ల మైలు రాయిని అందుకున్న మ్యాచ్లో విజయం సాధించడం కూడా చాలా సంతోషంగా ఉంది.
నా కుటుంబసభ్యులకు, సహచర ఆటగాళ్లకు, కోచ్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మధ్యమధ్యలో గాయాల బారిన పడతాం. ఆటలో ఇవన్నీ మామూలే. సిరీస్ల మధ్య రెండు మూడు నెలల విరామం ఉండటంతో గాయాల నుంచి కోలుకుని తిరిగి ఫామ్ను అందుకోవడం సులువుగా ఉంటుంది’ అని జులన్ వివరించింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య చివరి వన్డే శనివారం జరగనుంది. ఇప్పటికే 2-0తో భారత్ సిరీస్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more