టీమిండియా కెప్టన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు గత కొన్నాళ్లుగా ప్రేమలో విహరించి.. ఇటీవలే ఒక్కటైన సందర్భంగా అభిమానులు, క్రీడా ప్రముఖులు, సినిమా స్టార్లు ఇలా అన్ని వర్గాల నుంచి ఈ కొత్తజంటకు శుభాకాంక్షలు వెల్లివిరిసాయి. కాగా దాయాధి దేశం పాకిస్థాన్ క్రికెటర్ల నుంచీ విరుష్క జంట అభినందలు అందుకుంది. ఇక ఇవాళ మాత్రం అందరిలోనూ ఇద్దరు మాత్రం ప్రత్యేకమైన సందేశాలతో ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
వారిలో ఒకరు సౌతాఫ్రికా కెప్టెన్ ఏబి డివిలయర్స్ కాగా, మరోకరు పాకిస్థాన్ పేసర్ మహ్మద్ అమిర్. డివిలియర్స్ విరాట్-అనుష్కలను గంపెడు పిల్లలను కనాలని తనదైన శైలిలో తన ఐపీఎల్ కెప్టెన్ కు శుభాకాంక్షలు తెలుపగా, పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్ మాత్రం నిండు మనస్సుతో ఈ జోడికి శుభాకాంక్షలు తెలిపాడు. తనకు విరాట్ వివాహ వార్త సంతోషాన్నిచ్చిందని చెప్పాడు. వీరి కొత్త జీవితం బాగుండాలని శుభాకాంక్షలు తెలియజేసిన ఈ పాతికేళ్ల క్రికెటర్.. క్రికెట్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నట్టే నూతన జీవితంలో విజయవంతం కావ్వాలని అకాంక్షించాడు.
అంతేకాదు విరుష్క జంట ఆనందంగా సుఖమయ జీవితం గడపాలని అల్లాను ప్రార్థిస్తున్నానన్న అమీర్.. ఈ జోడిని కోట్ల కళ్లు చూస్తున్నాయని, అయితే ఈ జోడిపై మాత్రం దిష్టి కళ్లు పడకూడదని కూడా తాను అల్లాను ప్రార్థిస్తున్నానని.. దిష్టి కళ్ల నుంచి ఈ కొత్త జంటను కాపాడాలని సైతం తాను అల్లాను కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఇప్పటికే నేటితరంలో అత్యుత్తమ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని పలుమారు మీడియాకు చెప్పిన ఆమిర్ తనదైన నిండు మనసుతో ఈ జంటకు శుభాకాంక్షలను తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more