భారత్-శ్రీలంక మధ్య పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఘనతను సాధించాడు. తన పేరునే వున్న సొంత రికార్డును తానే బద్దలు కొట్టుకుని మరో కొత్త రికార్డను సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ దిగ్గజ క్రికెటర్ సాధించని అరుదైన ఫీటును మరోమారు సాధించాడు. వన్డే క్రికెట్ లో డబుల్ సెంచరీని నమోదుచేయడమే గొప్ప. అలాంటి రికార్డును ఇప్పటికే రెండు సార్లు చేసిన ఏకైక క్రికెటర్ గా వున్న రోహిత్ శర్మ తన రికార్డును తానే బద్దలు కొట్టాడు.
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో మ్యాచ్ లో మరోమారు డబుల్ సెంచరీ సాధించి.. తన రెండు డబుల్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టి.. మూడు డబుల్ సెంచరీలుగా కొత్త రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. శ్రీలంకతో ధర్మశాలలో జరిగిన తొలి వన్డే మ్యాచ్ నేపథ్యంలో ఎదురైనా పరాభవాన్ని, ఓటమిని గుర్తెపెట్టుకున్న రోహిత్.. తొలుతు నిదానంగా అచితూచి అడుతూ ఆ తరువాత వేగాన్ని పెంచారు. ఎంతలా అంటే శ్రీలంక బౌలర్లు తమ బంతులను రక్షించుకునేందుకు వైడ్ లైన్లను అశ్రయించేంతలా. అయినా రోహిత్, శ్రీయాస్ లు బెట్టువీడలేదు.
సెంచరీని నమోదు చేసుకున్న కెప్టెన్ రోహిత్ ఆ తరువాత చెలరేగి ఆడాడు. లక్మల్ వేసిన 43వ ఓవర్లో ఏకంగా 4 సిక్సులతో విరుచుకుపడ్డాడు. దీంతో 18 బంతుల్లోనే మరో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మ దెబ్బకు లంక ఆటగాళ్లు కళ్లు తేలేశారు. సిక్సర్లను ఇంత అలవోకగా కూడా కొట్టొచ్చా? అనే రీతిలో రోహిత్ రెచ్చిపోయాడు. ఈ క్రమంలో రోహిత్ డబుల్ సెంచరీ సాధించి.. తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. 151 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 12 సిక్సర్లు, 13 ఫోర్ల సాయంతో ద్విశతకం (201) సాధించాడు. ఈ క్రమంలో వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ గా రోహిత్ అవతరించాడు.
రోహిత్ సతీమణి రితిక అనందబాష్పాలు..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అడుతున్న వన్డే మ్యాచ్ ను చూసేందుకు వచ్చిన రోహిత్ శర్మ తన భార్యకు డబుల్ సెంచరీ సాధించిన క్రమంలో ఓ కిస్ ఇచ్చాడు. అదెలా అంటే గాల్లోనే. రోహిత్ శర్మ సరిగ్గా 197 పరుగుల వద్దనున్న క్రమంలో రెండు పరుగులు కోసం యత్నించాడు. అయితే బంతి వేగంగా వికెట్ కీపర్ వద్దకు చేరుతున్న సమయంలో రితిక కొంత అందోళనకు గురైంది. అయితే రోహిత్ జంప్ చేసిన డ్రాడ్ అవుతూ క్రీజులోకి చేరుకున్నాడు. ఆ తరువాత వెనువెంటనే వేసిన మరో బంతికి కూడా రోహిత్ టూ రన్స్ ను తీశాడు.
దీంతో రోహిత్ శర్మ మూడో పర్యాయం తన పేరున డబుల్ సెంచరీలను నమోదు చేసుకుని కొత్త రికార్డుకు తెరలేపాడు. అలా ఈ అరుదైన ఫీటును సాధించగానే గాల్లో ఎగిరి తన బ్యాటును డ్రెసింగ్ రూమ్ వైపు చూపాడు. ఆ తరువాత తన భార్యాకు, తన ఎడమ చేతి ఉంగరం వేలును ముద్దాడి తన భార్యకు గాలి సందేశం పంపాడు. అయితే రోహిత్ ఈ ఫీటు సాధించగానే అతని భార్య రితిక తీవ్ర ఉద్వేగానికి లోనైంది. స్టేడియంలో తనను టీవీ వారు చూస్తున్న విషయం తెలిసినా.. అమె తన ఉద్వేగాన్ని అపుకోలేకపోయింది. తన భర్త సాధించిన రికార్డుతో అమె తన ఆనంద భాష్పాలు రాల్చి బదులిచ్చింది.
A captain's knock. @ImRo45 has looked in full flow and has marched on to a well-made century. ODI Century no. 16 #TeamIndia #INDvSL pic.twitter.com/qWtwNpp7dr
— BCCI (@BCCI) December 13, 2017
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more