ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో శ్రీలంక బౌలర్ సురంగ లక్మల్ హీరో అయ్యాడు. అతడు బంతి వేయగానే వికెట్లను సమర్పించుకుని హీరోగా మారుస్తున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. వర్షం వల్ల మ్యాచ్ కు పలుమార్లు అంతరాయం కలిగింది. తాజాగా 11.5 ఓవర్ల వద్ద వెలుతురు సరిగా లేని కారణంగా మరోమారు ఆగిపోయింది. కాగా, తొలి ఓవర్ వేసేందుకు బంతి అందుకున్న లక్మల్ తొలి బంతికే ఓపెనర్ లోకేశ్ రాహుల్ (0)ను పెవిలియన్ పంపాడు.
ఆ తర్వాత జట్టు స్కోరు 13 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఏడో ఓవర్ రెండో బంతికి మరో ఓపెనర్ శిఖర్ ధవన్ (8)ను బౌల్డ్ చేశాడు. అనంతరం వెలుతురు సరిగా లేని కారణంగా అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు. కొద్దిసేపటి తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభం కాగా లక్మల్ బౌలింగ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. తొలి మూడు వికెట్లు లక్మల్ ఖాతాలోకే వెళ్లగా అందులో రెండు డకౌట్లు ఉండడం గమనార్హం. అంతేకాదు.. మొత్తం ఆరు ఓవర్లు వేసిన లక్మల్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టడం విశేషం.
టీమిండియా ఆటతీరుపై సోషల్ మీడియాలో అప్పుడే సెటైర్లు వినిపిస్తున్నాయి. అనామక బౌలర్లను హీరోలను చేయడంలో మనోళ్లు ముందుంటారంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. లక్మల్ ఖాతాలో మరెన్ని వికెట్లు చేరుతాయో చూడాలని మరికొందరు అంటున్నారు. కాగా, వెలుతురు కారణంగా ఆట ఆగిపోయిన సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. చతేశ్వర్ పుజారా (8), అజింక్యా రహానే (0) క్రీజులో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more