మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీసేన దుమ్మురేపింది. 11 మ్యాచుల తర్వాత టెస్టు జట్టులో చోటు సంపాదించిన ఓపెనర్ శిఖర్ ధావన్ (190) లంక బౌలర్లపై వీరవిహారం చేశాడు. 31 ఫోర్ల సాయంతో టీ20 తరహాలో విధ్వంసక బ్యాటింగ్ చేసి స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. అతనికి ఛతేశ్వర్ పుజారా (144) కూడా తోడవ్వడంతో పరుగుల సునామీలా పరుగుల వచ్చాయి. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 399/3తో పటిష్ఠ స్థితిలో నిలిచింది.
టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకొవడంతో ఓపెనర్ అభినవ్ ముకుంద్ తో కలసి వచ్చిన శిఖర్ ధావన్.. లంక బౌలర్లను కుమ్మెశాడు. అభినవ్ ముకుంద్ 12 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ప్రదీప్ బౌలింగ్ లో మాథ్యూస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తరువాత క్రీజులోకి వచ్చిన పుజారా (144)తో కలిసి ధావన్ (190) నిలకడగా ఆడాడు. ఏ మాత్రం తొందర పడకుండా ఆడి లంచ్ విరామానికి అర్ధశతకం సాధించాడు. ఇక రెండో సెషన్లో గబ్బర్ విజృంభించాడు. లంక బౌలర్లకు చుక్కులు చూపించాడు.
పుజారా చక్కగా స్ట్రైక్ రొటేట్ చేయడంతో శిఖర్ వరుస బౌండరీలతో శతకం చేశాడు. ఆ తర్వాత మరింత జోరు పెంచి ద్విశతకం దిశగా అడుగేశాడు. 190 పరుగుల వద్ద భారీ షాట్ ఆడబోయి 54.1వ బంతికి ప్రదీప్ బౌలింగ్ లోనే మాథ్యూస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్ కు 253 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రెండో సెషన్లో 5.96 రన్ రేట్ తో 167 పరుగులొచ్చాయి. దీంతో ఒక సెషన్లో అత్యధిక పరుగులు (126) చేసిన రెండో భారత బ్యాట్స్ మన్ గా శిఖర్ ధావన్ నిలిచాడు.
ఈ తరువాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఎనమిది బంతులు ఎదర్కోని మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు ప్రదీప్ బౌలింగ్ లోనే వెనుదిగిరాడు. ఆ తర్వాత వచ్చిన వైస్ కెప్టెన్ అజింక్య రహానె (39)తో కలిసి పూజారా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించి శతకాన్ని నమోదు చేశాడు. తొలి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి 144తో నిలిచాడు. పుజారాకు తోడుగా రహానె స్ట్రైక్ రొటేట్ చేయడంతో మూడో వికెట్ కు అజేయంగా 113 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. 2009లో న్యూజిలాండ్ పై 375/9 తర్వాత విదేశాల్లో భారత జట్టు తొలి రోజు అత్యుత్తమ స్కోరు ఇదే కావడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more