అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా క్రికెట్ విరాట్ కోహ్లీ ఇవాళ తన కెరీర్ లోనే చిరస్మరణీయ రోజుగా మలుచుకున్నాడు. తన క్రికెట్ కెరీర్ లోనే మూడు అరుదైన ఘనతలను అందుకుని రెట్టించిన వేగంతో ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ రికార్డుతో ఆయన గత కెప్టెన్లు బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్, ది గ్రేట్ వాల్ గా పేరోందిన రాహుల్ ద్రావిడ్ లతో పాటు మరో లెజండరీ బ్యాట్స్ మెన్ సునీల్ గవాస్కర్ సరసన చేరారు. పరుగుల దాహంతో చెలరేగిపోతున్న కోహ్తీ.. ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 35 పరుగులను పూర్తి చేసి.. ఈ ఏడాది వెయ్యి టెస్టు పరుగులను సాధించాడు. తద్వారా ఒక క్యాలెండర్ ఇయర్ లో వెయ్యి టెస్టు పరుగులను పూర్తి చేసుకున్న మూడో భారత కెప్టెన్ గా నిలిచాడు.
విరాట్ సాధించిన వెయ్యి పరుగుల్లో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 11 మ్యాచ్ ల్లో 17 వ ఇన్నింగ్స్ ఆడుతున్న కోహ్లి ఈ మార్కును చేరాడు. ఒక క్యాలెండర్ ఇయర్ వెయ్యి పరుగులు సాధించే క్రమంలో విరాట్ నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు 211. ఇక మరోవైపు మంచి ఫామ్ లో వున్న విరాటుడు 41 పరుగులను సాధించగానే తన టెస్టు క్రికెట్ లో నాలుగు వేల పరుగుల మైలురాయికి కూడా అందుకున్నాడు. 52 టెస్టు మ్యాచ్ లలో ఈ రికార్డును అందుకున్న కోహ్లీ 14వ టీమిండియా బ్యాట్స్ మెన్ గా నిలిచాడు.
ఇక మరోవైపు ఒక సిరీస్ లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించిన రెండో భారత కెప్టెన్ గా విరాట్ నిలిచాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 96వ పరుగు చేసే క్రమంలో ఈ సిరీస్ లో విరాట్ 500 పరుగుల మార్కును చేరాడు. తద్వారా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సరసన నిలిచాడు. ఇప్పటివరకూ ఈ ఫీట్ ను గవాస్కర్ మాత్రమే రెండుసార్లు సాధించాడు. 1978-79 సీజన్ లో వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో గవాస్కర్ ఐదు వందలకు పైగా పరుగులు చేయగా,1981-82 సీజన్ లో ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ లో గవాస్కర్ ఐదు వందల పరుగుల మార్కును రెండోసారి సాధించాడు.
రెండో శనివారం సందర్భంగా ముంబైలోని వాంఖేడ్ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసి పోయిన సందర్బంగా వారందరికీ కోహ్లీ సాధించిన వెయ్యి, నాలుగు వేల పరుగులతో పాలు సిరీస్ లో ఐదు వందల పరుగులను సాధించి జోష్ నింపాడు. ఇదిలా ఉండగా ఒక ఏడాది వెయ్యికి పైగా టెస్టు పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో సచిన్ ముందంజలో ఉన్నాడు. 2010లో సచిన్ 1562 పరుగులను చేశాడు. ఆ తరువాత వీరేంద్ర సెహ్వాగ్ ఆటగాడిగా రెండో స్థానంలో ఉన్నాడు. 2010లో సెహ్వాగ్ 1422 పరుగులు నమోదు చేశాడు. ఆ తరువాత కెప్టెన్ గా ఈ రికార్డును సొంతం చేసుకున్న వారిలో2006వ సంవత్సరంలో రాహుల్ ద్రావిడ్ కూడా వున్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more