టీమిండియాతో నాగ్ పూర్ వేదికగా కొనసాగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా చెత్త రిక్డార్డును మూట గట్టుకుంది. తొలి ఇన్నింగ్స్ లో సఫారీలు 79 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ పై అతి చెత్త గణాంకాలను నమోదు చేశారు. అంతకుముందు భారత్ పై శ్రీలంక ఒక ఇన్నింగ్స్ లో నమోదు చేసిన అత్యల్ప స్కోరు రికార్డు సఫారీలు చెరిపేశారు. 1990వ సంవత్సరంలో చత్తీస్ గఢ్ లో భారత్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో శ్రీలంక 82 పరుగులకు ఆలౌటైంది. దీనికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయిన దక్షిణాఫ్రికా 12వ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. కాగా, 1955లో ఇంగ్లండ్ తో ఆక్లాండ్ లో జరిగిన టెస్టులో న్యూజిలాండ్ ఒక ఇన్నింగ్స్ లో 26 పరుగులకు ఆలౌటై.. అత్యల్ప పరుగుల రికార్డు తన పేరున రాసుకుంది.
ఇదిలా ఉండగా ప్రస్తుత టెస్టులో టీమిండియా సరికొత్త రికార్డును నెలకొల్పింది. 37 ఏళ్ల అనంతరం ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ లో చేసిన పరుగులను టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో రెండు, మరి కొన్ని వికెట్లు కోల్పోయి చేరుకోవడం ఇదే ప్రథమం. అంతకుముందు 1978లో కోల్ కతాలో వెస్టిండీస్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఈ ఘనతను అందుకుంది. దీంతో పాటు తొలి ఐదు సెషన్ లలో 25కు పైగా వికెట్లు పడటం 2007 తరువాత ఇదే తొలిసారి. దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ ల మధ్య కేప్ టౌన్ లో ఈ రికార్డు నమోదు కాగా, మళ్లీ ఎనమిదేళ్ల తరువాత ఈ రికార్డు పునరావృతం అయ్యింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more