టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ నుంచి తన ప్రియురాలికి గాల్లో ముద్దులు ఇవ్వడంపై భారత్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. కోహ్లీ ముద్దులు విసరడంపై తనకెలాంటి అభ్యంతరాలు లేవన్నాడు. అయితే భారీగా స్కోర్లు సాధించినప్పుడు మాత్రమే ఫ్లైయింగ్ కిస్ ఇవ్వాలని అన్నారు. విరాట్ కోహ్లి సెంచరీ చేసి ప్రియురాలికి గాల్లో ముద్దు విసిరితే తనకేం అభ్యంతరం లేదని, కానీ జీరో పరుగులు చేసి గాల్లో ముద్దులు పెడితేనే ఇబ్బందంటూ సైటర్ విసిరారు. తాము క్రికెట్ ఆడినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పడున్న పరిస్థితులు వేరని ఆయన అంగీకరించారు.
టెస్టు క్రికెట్ నుంచి మేటైన క్రీడాకారుల ఎంపిక జరిగిన క్రమం తమదని అలానే తాము ఎదిగామని, అయితే ఇప్పుటి తరం మాత్రం టెస్టు కన్నా పరిమిత ఓవర్ల క్రికెట్ కే అధిక ప్రాధాన్యమిస్తున్నారని అభిప్రాయపడ్డారు. స్లెడ్జింగ్ సహా కొన్ని వికృతాలు, వేధింపులు కూడా ఆటలో భాగంగా మారిపోయాయని చెప్పారు. 20 ఓవర్ల పరిమిత మ్యాచ్ టీ 20 లు కూడా అమోదించపడిన ఫార్మెట్ గేమ్ లా మారిందన్నారు. ఇక ఆటగాళ్లు గౌండ్ లోపలికి వచ్చిన తరువాత అందరూ ఆలింగనం చేసుకుంటూ కనబడటాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
భారత్ ప్రపంచకప్ గెలిచే అవకాశాలు 25 శాతం మత్రమే ఉన్నాయని కపిల్ చెప్పారు. సెమీ ఫైనల్ కు చేరుకునే ప్రతి జట్టుకు కేవలం 25 శాతం అవకాశాలు మాత్రమే వుంటాయని, ఆ తరువాతే అక్కడి నుంచి మ్యాచ్, మ్యాచ్ లో విన్నింగ్ శాతాలు పెరుగుతాయని కపిల్ అబిప్రాయపడ్డారు. ఏ మ్యాచ్ అయినా ప్రారంభం చాలా ముఖ్యమైనదని ఆయన చెప్పకోచ్చారు. తొలి 15 ఓవర్లలో విక్కట్లు నష్టపోకుండా 40 నుంచి 50 పరుగుతు సాధిస్తే.. సునాయాసంగా 270 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థుల ముందు పెట్టవచ్చనన్నారు. అయితే విక్కెట్ కొల్పోతే మాత్రం ఫలితాలు ఇందుకు భిన్నంగా వుంటాయని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 18 | సూర్యకుమార్ యాదవ్ కల ఎట్టకేలకు సాకరమైంది. టీమిండియా తరఫున ఆడాలన్న అతడి నిరీక్షణకు తెరపడి, ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ... Read more
Feb 27 | దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్కు కెప్టెన్ మిథాలీ రాజ్, 3 టీ20 మ్యాచ్ల సిరీస్కు హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సభ్యుల... Read more
Feb 27 | ఇంగ్లండ్తో జరుగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఫాస్ట్బౌలర్ అహ్మదాబాద్ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. తనకు విశ్రాంతి కావాల్సిందిగా బుమ్రా భారత... Read more
Feb 16 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్ను విడుదల చేయగా, అందులో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 25 మ్యాచులు అడిన ఇంగ్లాండ్ 6877 పాయింట్లతో 275 రేటింగ్ తో అగ్రస్థానంలో కోనసాగుతోంది. కాగా... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. పర్యాటక జట్టుపై ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో నెగ్గిన టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్... Read more