ముక్కోణపు సిరీస్’లో భాగంగా పెర్త్’లో జరిగిన మ్యాచ్’లో ఇంగ్లాండ్ జట్టు భారత్’కు బెర్త్ లేకుండా చేసింది. అందరూ ఊహించినట్లుగానే ఈ మ్యాచ్’లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టు ఆటగాళ్లు చేతులెత్తేయడంతో టపీటపీమంటూ వెనువెంటనే వికెట్లు కోల్పోయారు. దీంతో కేవలం 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ప్రభావం బౌలర్లపై భారీగానే పడింది. ఇక బ్యాటింగ్ బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు కూడా మొదట్లోనే పవేలియన్’కు చేరడంతో గెలుపు ఇండియావైపు మరలింది. బౌలింగ్’లో భారత్ బాగానే రాణించిందని అనుకున్నారు. కానీ.. అప్పుడే బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ఇంగ్లాండ్ ఆటగాడు తన జట్టుకు అండగా నిలిచి గెలుపువైపు దిశగా తీసుకెళ్లాడు. అతనితోపాటు మరొకరు తోడై జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు.
మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్’ను ఎంచుకుంది. దీంతో ఇండియా బ్యాటింగ్ బరిలో దిగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బ్యాటుతో మైదానంలోకి వచ్చిన భారత్ ఓపెనర్లు రహానే, శిఖర్ ధావన్.. తమ వికెట్ కోల్పోకుండా ఓ మోస్తరు వరకు పటిష్టంగానే రాణించారు. ఓవర్ల మీద ఓవర్ల మింగేస్తూ తక్కువ స్కోరు చేసినా.. వికెట్ కాపాడుకోవడంలో శాయశక్తులా ప్రయాణించారు. అయితే 83 పరుగుల వద్ద ధావన్ ఔటయ్యాడు. తర్వాత బరిలోకి దిగిన కోహ్లీ 8 పరుగులకే వెనుదిరిగాడు. అంతే! అక్కడి నుంచి ఇండియా ఆటగాళ్లు వరుసగా టపీటపీమంటూ వికెట్లు కోల్పోతూ వచ్చారు. అయితే.. రహానే (73) ఒక్కడే అత్యధిక స్కోరుతో తమ ప్రతిభను నిరూపించుకున్నాడు. దీంతో ఇండియా నిర్ణీత 48.1 ఓవర్లలో ఆలౌట్ అయి కేవలం 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఇక 201 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. మొదట్లో భారత బౌలర్ల ధాటికి తడబడ్డారు. 14 పరుగుల వద్దే వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. తమ జోరును తగ్గించుకుని జాగ్రత్తగా ఆడారు. ఇంతలోనే వారి వికెట్లు కూడా వరుసగా పడిపోవడం మొదలయ్యాయి. ఒకానొక దశలో 18 ఓవర్లకుగానూ ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 54 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక 20వ ఓవర్లో బిన్నీ 5వ వికెట్ తీసుకున్నాడు. అంతే! ఇక క్రీజులో వున్న జేమ్స్ టేలర్, జాన్ బట్లర్ నిలకడగా ఆడుతూ వచ్చారు. దీంతో ఇంగ్లాండో 27 ఓవర్లలో 101/5 పరుగులు చేసింది. అయితే.. టేలర్ 82, బట్లర్ 67 పరుగులతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో మొత్తం 7 వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ 201 పరుగులు చేసి గెలిచింది.
దీంతో ఇండియా జట్టు ఈ ముక్కోణపు సిరీస్ నుంచి ఔట్ అయింది. ఇక ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. ఇదిలావుండగా.. ఇండియా ప్రదర్శించిన ఆటను చూస్తుంటే.. ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ కప్’లో ఇదే పరిస్థితిని కొనసాగిస్తుందేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరల్డ్ కప్’కు హెల్ప్ అవుతుందనే భావనతో ఇండియాను ముక్కోణపు సిరీస్’కు పంపితే.. ఒక్క విజయం కూడా సాధించుకోకుండా రాక, పేలవమైన ప్రదర్శనతో వెనుదిరిగి వచ్చేసింది. మరి.. వరల్డ్ కప్’లో ఎలా ఆడనుందో?
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more