ప్రపంచ వ్యాప్త క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ గడియాలు రానే వస్తున్నాయి. వచ్చే నెల 14 ఓ వైపు ప్రేమికలందరూ ఎంతో ఉత్సహభరితంగా వాలెంటల్స్ డే రోజును వేడకగా జరుపుకోనున్నా.. వారందరి ఆశలకు క్రికెట్ ప్రవంచ కప్ గండి కోడుతుంది. వరల్డ్ కప్ కోసం అంతటి ఉత్కంఠ భరితంగా అభిమానులు నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ప్రపంచ కప్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిపిఐ) కుర్రాళ్ల జట్టును ప్రకటించింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. జట్టు వివరాలను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. భారత జట్టులో తెలుగుతేజం అంబటి రాయుడకు చోటు లభించింది. కాగా గత ప్రపంచ కప్ లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు మొండిచేయి ఎదురైంది. ఆల్ రౌండర్ జడేజాను జట్టులోకి తీసుకోవడంతో యువీకి చోటు దక్కలేదు. ఇక మురళీ విజయ్, రాబిన్ ఊతప్పలకు కూడా స్థానం లభించలేదు.
ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, రహానె, జడేజా, అంబటి రాయుడు, ఇషాంత్ శర్మ, షమీ, స్టువార్ట్ బిన్నీ, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అక్షర పటేల్, అశ్విన్ లకు టీమిండియా జట్టులో స్థానం దక్కింది. తెలుగు తేజం అంబటి రాయుడుకు మొదటి సారిగా ప్రపంచ వరల్డ్ కప్ లో స్థానం దక్కింది. అయితే ఈ జట్టులో యూవరాజ్ సింగ్ కు స్థానం దక్కుతుందన్న వార్తలు నేపథ్యంలో యువరాజ్ సింగ్ అభిమానులను బిసిసిఐ నిరాశకు గురిచేసింది. యూవీ స్థానంలో ఆల్ రౌండర్ జెడేజాను తీసుకున్న నేపథ్యంలో యవరాజ్ సింగ్ కు బిసీసీఐ మొండి చెయ్యి చూపింది. కెప్టెన్ ధోణి ఒత్తిడి కారణంగానే యువరాజ్ సింగ్ ను బిసిసిఐ పక్కనబెట్టినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కేన్సర్ నుంచి కోలుకున్న తర్వాత టీ20 వరల్డ్ కప్ లో ఆడిన యువరాజు నిరాశపరిచాడు. దీంతో అతడికి దారులు మూసుకుపోయాయి. అటు మెరుగైన ఆటతీరుతో అందరినీ అకట్టుకుంటున్న రాబిన్ ఉత్తప్పాను కూడా బిసిసిఐ పక్కనబెట్టింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more