అగ్ర జట్టుగా చెలామణి అవుతున్న టీం ఇండియా గెలవాల్సిన మ్యాచ్ ల్లో చాలా పొరపాట్లు చేసి ఓడి ఆసియా కప్ ఫైనల్ అవకాశాలు చేజార్చుకున్న తరువాత నామమాత్రపు మ్యాచ్ లో అన్ని విభాగాల్లో రాణించి పసికూన ఆప్ఘనిస్తాన్ పై కాస్తంత ఊరట పొందింది.
పాకిస్థాన్, శ్రీలంక పై రాణించని బౌలర్లు పసికూన పై చెరగడంతో ఆప్ఘాన్ పై ఎనమిది వికెట్ల తేడాతో గెలిచింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్టాన్ బ్యాట్స్ మెన్స్ బ్యాటింగ్ లో ఘోరంగా విఫలం అవ్వడమే కాకుండా, భారత స్పిన్ ధాటికి 45.2 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత స్పిన్ మాంత్రికులు జడేజా (4/30), అశ్విన్ (3/31) రాణించారు. ఆప్ఘాన్ బ్యాట్స్ మెన్స్ లో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు.
షెన్వారి అర్థ శతకంతో రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా చేసింది. తరువాత స్వల్ప లక్ష్యాన్ని ఛేధించడానికి బరిలో దిగిన భారత్ కేవలం 32.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అలవోకగా గెలిచి బోనస్ పాయింట్ తో గెలిచారు. ఓపెనర్లు శిఖర్ ధావన్ (78 బంతుల్లో 60; 4 ఫోర్లు, 1 సిక్సర్), అజింక్యా రహానే (66 బంతుల్లో 56; 5 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు.
మొత్తం మీద ఆసియాకప్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరుగుతున్నా... బంగ్లాదేశ్లోనే మరో 15 రోజుల్లో ప్రారంభమయ్యే టి20 ప్రపంచకప్కు ఈ టోర్నీ ఓ సన్నాహకం అనుకోవాలి. మరి అప్పుడైనా రాణిస్తారో లేక ఇలా లీగ్ దశలోనే వెనుదిరుగుతారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more