ఛాంపియన్స్ ట్రోఫ్రీ విజయంతో విండీస్ గడ్డపై ముక్కోణపు సిరీస్ కోసం అడుగు పెట్టిన ధోని సేనకు ఎదురుదెబ్బ తగిలింది. నిన్న రాత్రి ఆతిధ్య జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో ధోని సేన ఒక్క వికెట్ తేడాతో పరాజయం పాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 229 పరుగులు చేసింది. భారత్ నిర్దేశించిన 230 పరుగుల లక్ష్యాన్ని మరో 2.2 ఓవర్లు ఉండగానే తొమ్మిది వికెట్లు కోల్పోయి విండీస్ చేధించింది. రోహిత్ శర్మ (60) హాఫ్ సెంచరీకి తోడు రైనా (44) రాణించడంతో మినహా ఇతర బ్యాట్స్మెన్ నిరాశపరిచారు. ధోనీ (27), దినేశ్ కార్తీక్ (23) ఫర్వాలేదనిపించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. టాపార్డర్లో ధావన్ (11), కోహ్లీ (11) విఫలమవ్వడంతో భారీ స్కోరు సాధించలేక పోయారు. 230 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 9 వికెట్లు కోల్పోయి 47.4 ఓవర్లలో 230 పరుగులు చేసింది. దాంతో విండీస్ జట్టు ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. ఓపెనర్ చార్లెస్ (97) ఒంటరి పోరాటంతో విండీస్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే 40.2 ఓవర్ లో యాదవ్ బౌలింగ్ లో చార్లెస్ అవుట్ కావడంతో విండీస్ కష్టాల్లో పడినట్టు కనిపించింది. కాని రోచ్, బెస్ట్ లు చివర్లో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడి విండీస్ జట్టుకు విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో యాదవ్ 3, శర్మ, అశ్విన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. విండీస్ బౌలర్లలో రోచ్, బెస్ట్, సమ్మి రెండేసీ వికెట్లు, శ్యామ్యూల్ ఒక వికెట్ పడగొట్టారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more