పూర్వం మహామునులంతా కలిసి యాగం చేయాలనే నెపంతో ఒక ప్రాంతానికి చేరుకుంటారు. అదే చోటుకు మునులందరికంటే ఎంతో శ్నేష్టుడయిన సూతమహాముని అక్కడికి విచ్చేస్తాడు.
వేదాలను విభజించి, పందచమవేదమైన మహాభారతాన్ని, ఉపనిషత్తుల్ని, మరెన్నో గ్రాంథాలను అందించిన వ్యాసమహర్షి శిస్యుడే ఈ సూతుడు. అటువంటి సూతుడు అక్కడికి రావడంతో మునులంతా సంతోషంచి, తమ జన్మ ధన్యమైందని భావిస్తారు.
మునీశ్వరులంతా కలిసి సూతమహామునికి అతిథి సత్కారాలు చేసి.. అర్ఘ్యపాద్యాదులను సమర్పించి పూజిస్తారు. దాంతో సూతుడు చాలా సంతోషించి వారందరినీ ఆశీర్వదిస్తాడు.
అనంతరం మునులంతా కలిసి సూతుడిని... ‘‘మేము యాగం చేయాలని సంకల్పించగానే మీరు ప్రత్యక్షం కావడంతో మాకు చాలా సంతోషంగా వుంది. మీ దయవల్లే మేము అనేక పురాణాలు విని మనస్సును పునీతం చేసుకున్నాం. అదేవిధంగా పవిత్రమైన మీ వాణితో శివుని గురించి, ఆయన మహత్యం గురించి వినాలని అనుకుంటున్నాము. కాబట్టి మమ్మల్ని కనికరించి ఆ కథలను చెప్పి.. మమ్మల్ని తరింపచేయండి’’ అంటూ ప్రార్థిస్తారు.
సూతుడు శివుని గురించి వివరిస్తూ కథను మొదలుపెడతాడు..
నారదుని దీక్ష :
‘‘ఎంతో పవిత్రమైన హిమాలయ పర్వతశ్రేణుల్లో వున్న మానస సరోవరం వద్ద ఒక పర్ణశాలను నిర్మించుకుని.. నారదుడు శివుని గురించి తపస్సు చేయడం ఆరంభించాడు. తగువులమారి, కలహాభోజనుడు వంటి అనేక పేర్లున్నా.. ఆయన చేసే పనులన్నీ చివరకు జగత్కల్యాణంగా పరిణమించడంతో అందరూ ఆయన్ను కొనియాడుతారు. అటువంటి నారదుడు తపస్సు చేయడం చూసి.. స్వర్గాధిపతి అయిన ఇంద్రునికి భయం పుట్టుకుంది.
సాధారణంగా లోకంలో ఎవరు తపస్సు చేసినా.. ముందుగా భయపడేది దేవేంద్రుడే. ఎందుకంటే తన పదవికి ఎక్కడ గండం వస్తుందోనని భయపడుతుంటాడు. ఇప్పుడు కూడా అదే భయంతో నారదుని తపస్సుని చెదరగొట్టేందుకు తన రాచసభలో నాట్యమాడే రంభ, ఊర్వశి, మేనక వంటి అస్పరసల్ని భూలోకానికి పంపిస్తాడు. ఎలాగైనా నారదుని తపస్సుని భగ్నం చేయాలని వారిని ఆదేశిస్తాడు ఇంద్రుడు.
ఇంద్రుని ఆజ్ఞమేరకు ఆ అప్సరసలు నారదుడు తపస్సు చేస్తున్న ప్రాంతానికి చేరుకుంటారు. తమ నటనతో, సౌందర్యంతో నారదుని దృష్టిని తపస్సు నుంచి తప్పించేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తారు. చివరికి తమ ఒంపుసొంపుల్ని సైతం ఆజన్మం బ్రహ్మచారి అయిన నారదుని మేనుకు తగిలేలానాట్యం చేస్తూ.. అతనిలో శృంగార పిపాసను రేకెత్తించేందుకు పూనుకుంటారు.
ఆ ముగ్గరు నారీమణుల నాట్యంచూసి చుట్టుపక్కల వున్న పశుపక్షాదులు కూడా పరవశిస్తాయి గానీ.. నారదునిలో మాత్రం ఎటువంటి చలనం వుండదు. వీళ్ల ప్రలోభాలకు ఏమాత్రం ఆకర్షితుడు కాడు. అయితే.. కన్నులు మూసుకున్నట్టే నటించి, వీళ్లేం చేస్తున్నారో అనుగ్రహిస్తూ వుంటాడు.
ఎంతసేపటికీ నారదునిలో ఎటువంటి చలనం లేకపోవడాన్ని గమనించిన ఈ ముగ్గురు నారీమణులు అలిసిపోయి... ‘‘ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే ఈ జడధారి ముందు మన ప్రయత్నమంతా వృథాయే’’ అనుకుంటూ తిరిగి ఇంద్రలోకానికి వెళ్లిపోతారు.
(And get your daily news straight to your inbox)
Nov 18 | పూర్వం భక్తులు తమతమ ఇష్టదైవాలను ఎంతగా తమ భక్తిని చాటుకున్నారంటే.. సాక్షాత్తూ దేవుళ్ళే స్వయంగా భువికి దిగివచ్చి వారి కోర్కెల్ని నెరవేర్చేవారు. అలా తన భక్తితో వెంకటేశ్వరుడు మెప్పించిన అపరభక్తుడు బావాజీ.. ఆయనతో కలిసి... Read more
Nov 06 | పూర్వం.. చ్యవనుడు అనే మహర్షికి సుకన్య అనే రాజకుమార్తెతో వివాహం అయ్యింది. చ్యవనుడు అంధుడు మాత్రమే కాకుండా చాలా ముసలివాడు అయినప్పటికీ.. కుందనపుబొమ్మలా వుండే సుకన్య తన యవ్వనాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పతివ్రతా నియమంతో... Read more
Nov 02 | స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రునికి అహంకారం ఎక్కువ. భువిపై వున్న మానవులందరూ తన దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉన్నారనీ, తనని భయభక్తులతో కొలిస్తే కానీ వారికి మనుగడ వుండదని విర్రవీగుతుంటాడు. అయితే.. కృష్ణుడు అతని... Read more
Oct 07 | పూర్వం ‘పులోమ’ అనే అతిలోక సౌందర్యవతి వుండేది. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడైన ‘పులోముడు’ అనే దైత్యుడు.. ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా అనుకున్న వెంటనే తన మనోరథాన్ని పులోమ తండ్రికి తెలిపాడు.... Read more
Sep 22 | మహాభారతంలో కీలకపాత్రుడైన కర్ణుడు.. ఆనాడు దాకకర్ణుడనని ప్రసిద్ధి. తనకు తోచించి ఇతరులకు దానం చేయడంలో ఇతను దిట్ట. బంగారమైనా, మరేమైనా సరే.. దానం చేయడంలో కర్ణుడిని మించినవాడు ఎవడూ లేడు. పైగా.. కృష్ణుడు సైతం... Read more