స్థలపురాణం :
పూర్వం మూగ, చెవిటి, గుడ్డి వారైన ముగ్గరు అన్నదమ్ములు ఈ కాణిపాక ప్రాంతంలోనే నివసిస్తుండేవారు. వారికి కాణి మడి (భూమి) వుండేది. ఆ భూమిలో ఏతం తొక్కడానికని ఒకరోజు ఒక చిన్నబావిని తవ్వాలనుకుని నిర్ణయించుకుంటారు. దాంతో వారు ముగ్గురు కలిసి తమకు అనుగుణంగా ఒక చిన్న బావిని తవ్వుకున్నారు. అందులో వచ్చిన నీటితో సేద్యం చేసుకుంటూ హాయిగా బతికేవారు.
కొంతకాలం తరువాత ఆ ప్రాంతంలో కరువు ఏర్పడింది. దీని ప్రభావంతో వారు ముగ్గరు తవ్వుకున్న చిన్న బావిలోని నీరు చాలకపోవడంతో... ఇంకా లోతుగా తవ్వాలని అనుకుంటారు. అలా నిర్ణయించుకున్న వారు బావిని మరింత లోతుగా తవ్వడం ప్రారంభిస్తారు. అలా బావిని తవ్వగా తవ్వగా... కొంతసేపటి తరువాత వారు తవ్వడానికి ఉపయోగిస్తున్న గునపం ఒక రాయికి తగిలి.. దానినుంచి రక్తం ఉవ్వెత్తున వారి ముగ్గురి చిందింది. ఆ రక్తం వారి మీద పడిన మరుక్షణమే.. వారికున్న వైకల్యాలు తొలగిపోయి మామూలుగా మారిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత ప్రజలు తండోపతండాలుగా ఆ ముగ్గరు బావి తవ్విన ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ వున్న మట్టిని శుభ్రపరిచి చూడగానే వారందరికీ వినాయకుని రూపంలో వున్న ఒక విగ్రహం కనిపించింది. ఆ విధంగా వెలిసిన వినాయకుని విగ్రహానికి ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయమే కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆలయంగా పేరు పొందింది. ఇప్పటికీ ఆ స్వామివారి అంతరాలయం బావిలోనే వుంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయాన్ని సందర్శించుకున్నవారికి వినాయకుడు సిద్ధి, బుద్ధుని ప్రసాదిస్తాడని... అలాగే తప్పు చేసిన వారికి తగినవిధంగా శిక్షలు వేసి దండిస్తారని ఎంతో ప్రగాఢంగా నమ్ముతారు. అందువల్లే ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఎవ్వరైనా అసత్యాన్ని పలకరు.
ఆలయ విశేషాలు :
శ్రీ వరసిద్ధి వినాయకుని కాణిపాక క్షేత్రం చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో కాణిపాకం అనే గ్రామంలో కొలువై వుంది. పురాతన కథనాల ప్రకారం స్వామివారు ఈ ప్రదేశంలో వున్న బావిలో స్వయంభూగా వెలిశాడు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు అయిన కుల్తుంగ చోళుడు నిర్మించాడని కొన్ని శాసనాల ప్రకారం తెలుస్తోంది.
ఈ ఆలయంలో రెండు ప్రత్యేకమైన విశేషాలు వున్నాయి. అవేమిటంటే.. స్వామివారు కొలువైవున్న బావిలో నీరు భూభాగానికి సమానంగా ఎల్లప్పుడూ వుంటాయి. ఆ నీటినే భక్తులకు తీర్థంగా ప్రసాదిస్తారు అర్చకులు. ఇందులోనే మరో విశేషం ఏమిటంటే.. ఎప్పుడూ నీళ్లతో నిండి వుండే ఆ బావి చుట్టుపక్కల వున్న ప్రదేశంలో 40 అడుగుల లోతువరకు తవ్విచూసినా.. నీరు అస్సలు దొరకవని అక్కడున్న ప్రజలు చెబుతున్నారు.
ఈ ఆలయానికి చుట్టు వరదరాజస్వామి, మణికంటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి మొదలగు ఆలయాలు వెలిసి వున్నాయి. వినాయకచవితి ఉత్సవాలను కాణిపాకంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. మొత్తం 20 రోజులవరకు జరిగే ఇక్కడ ఉత్సవాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివస్తారు.
(And get your daily news straight to your inbox)
May 31 | భాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనూమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారీ సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు శోభాయత్రతో ఘనంగా ముగుస్తాయి. ఏటా చైత్ర పౌర్ణమిరోజు హన్ మాన్ (చిన్నజయంతి),... Read more
Jan 13 | అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు, తప్పని పరిస్థితుల్లో ఋషిని హత్యచేసాడు... ఇందుకు ఎంతో పశ్చ్యాతాపపడ్డాడు... ఎలా అయిన "బ్రహ్మ" హత్యా దోషాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నాడు... అన్ని ప్రాంతాలు సందర్శిస్తూ, అన్ని ఆలయాలలో పూజలు చేయ్యసాగాడు... కానీ,... Read more
Nov 24 | భారతదేశంలో వెలిసిన అత్యంత పురాతనమైన ఆలయాల్లో... వరంగల్ జిల్లాలోని అయినవోలు గ్రామంలో వెలిసిన మల్లికార్జున స్వామివారి దేవాలయం ఒకటి. విశాల ప్రాంగణంలో ఎంతో అద్భుతంగా వెలిసిన ఈ ఆలయం.. కాకతీయుల కాలంలో నిర్మింపబడింది. కాకతీయ... Read more
Nov 21 | సోమనాథ్ క్షేత్రం.. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రా ప్రాంతంలోని వెరావల్లో వుంది. దీనిని ‘ప్రభాస తీర్థం’ అని కూడా పిలుస్తారు. స్థలపురాణం ప్రకారం.. ఈ ఆలయాన్ని చంద్రుడు... Read more
Nov 19 | ఆధ్యాత్మిక, చారిత్రాత్మక సంపదగల భారతదేశంలో కొన్ని ఆలయాలు చరిత్రపుటలో మరుగునపడుతున్నాయి. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే.. నమ్మలేని అద్భుత గాధలు తెలుసుకోవచ్చు. అలాంటి ఆలయాల్లో ‘భోగేశ్వరాలయం’ ఒకటి. కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించబడిన ఈ ఆలయం.. వరంగల్... Read more