అమరారామము
గుంటూరు జిల్లాలో నగరానికి 35 కి.మీ.ల దూరంలో కృష్ణానదీ తీరమున వెలసిన అమరావతిలో ఈ క్షేత్రం ఉంది. పంచరామాల్లో మొదటిదిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో గల స్వామిని ‘అమరేశ్వరుడు’ అని పిలుస్తారు. గర్భగుడిలో స్వామి వారి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఈ విగ్రహాన్ని తారకాసురుడిని వధించిన తర్వాత తన కంఠంలోని శివలింగం చెల్లాచెదురు అవ్వగా.. అందులోని ఒక భాగాన్ని తీసుకొని ఇంద్రుడు ప్రతిష్టించాడని భక్తుల విశ్వాసం.